ఘనంగా బ్రహ్మానందం కొడుకు సిద్ధార్ధ్ వివాహం

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం బూర వినయ్, పద్మజ కుమార్తె
ఐశ్వర్యతో శుక్రవారం రాత్రి జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రమఖులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్, హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, బాలకృష్ణ, శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, శేఖర్ కమ్ముల తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొని తమ ఆశీస్సులు అందజేశారు. బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. రెండో కొడుకు సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు