ఏప్రిల్ 4 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తున్న ‘హోం టౌన్’

రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ హోం టౌన్. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఆహా తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇంటి చుట్టు అల్లుకున్న అనుబంధాల నేపథ్యంతో తెరకెక్కిన హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

హోం టౌన్ వెబ్ సిరీస్ లో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. ఇల్లు అనేది ఒక కామన్ ఎమోషన్ కాబట్టి..ఈ సిరీస్ అన్ని వర్గాల ఆడియెన్స్ కు రీచ్ అవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.