వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార కీ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కాలమేగా కరిగింది”. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో “కాలమేగా” కరిగింది సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఊహలోన ఊసులాడే..’ పాటను విడుదల చేశారు.
‘ఊహలోన ఊసులాడే..’ పాట మ్యూజిక్ లవర్స్ ఇష్టపడేలా రూపొందించారు. ఈ పాట ట్యూనింగ్, లిరిక్స్, సింగర్స్ పాడిన విధానం వినగానే ఆకట్టుకుంటోంది. టీనేజ్ లవ్ లోని బ్యూటిఫుల్ ఎమోషన్స్ ‘ఊహలోన ఊసులాడే..’ పాటలో ఉన్నాయి. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా..సింగార మోహన్ క్యాచీ లిరిక్స్ రాశారు. సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా పాడారు.