అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్ ప్రారంభిస్తున్న ఉపాసన

పిల్లల వైద్యం కోసం అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. ఈ హాస్పిటల్ రాష్ట్ర స్థాయిలో పిల్లలకు వైద్య సేవలు అందిస్తుందని ఆమె హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో తెలిపారు. త్వరలోనే ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తామని ఆమె తెలిపారు.

ప్రస్తుతం ఆపోలో ఆస్పత్రుల హెడ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్స్ ఫర్మేషన్ గా పనిచేస్తున్నారు ఉపాసన. యువర్ లైఫ్ సంస్థకు వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. పిల్లల కోసం మంచి వైద్య సేవలు అందించేందుకు అపోలో చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఇటీవల ఆమె పాప క్లిన్ కారకు జన్మనిచ్చారు. క్లిన్ కార రాకతో మెగా కుటుంబంలో ఆనందాలకు హద్దే లేకుండా పోయింది.