సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్

వరద బాధితుల సహాయార్థం తన వంతు విరాళం అందించేందుకు ముందుకొచ్చారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu). ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy)ని ఆయన నివాసంలో కలిసి 50 లక్షల రూపాయల చెక్ అందజేశారు. తన ఏఎంబీ మాల్ తరుపున మరో 10 లక్షల డొనేషన్ చెక్ ను ముఖ్యమంత్రికి అందించారు మహేశ్ బాబు. మహేశ్ తో పాటు నమ్రత కూడా సీఎంను కలిశారు.

మిగతా స్టార్ హీరోస్ తో పాటు వరదసాయం ప్రకటించిన మహేశ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను ఈరోజు సీఎం రేవంత్ కు అందించారు. మహేశ్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29) కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.