మళ్లీ నెటిజన్స్ కు దొరికిపోయిన మోహన్ బాబు

తిరుపతి లడ్డూ(Thirupathi laddu)లో కల్తీ నెయ్యి వాడారనే విషయం బయటకు వచ్చి భక్తులంతా హాహాకారాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం దీని మీద విచారణ జరిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పొలిటికల్ ఇష్యూస్ లో తలదూర్చే మంచు ఫ్యామిలీ కూడా తమ వంతుగా స్పందిస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. పవన్ ను ప్రకాష్ రాజ్ విమర్శిస్తే మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు మోహన్ బాబు వంతు వచ్చింది.

తిరుపతి లడ్డు వివాదంపై ట్వీట్ చేసిన మోహన్ బాబు(Mohanbabu) ఈ ట్వీట్ లో తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరారు ఇంతవరకు ఓకే గానీ సీఎం చంద్రబాబును ప్రాణ మిత్రుడు అని, అతనికి వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం ఉండాలని రాసుకుంటూ వచ్చాడు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నా బంధువు అనడం, జగన్ సీఎం అయ్యాక నా అల్లుడు అని చెప్పుకోవడం, చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన విషయం గుర్తుచేస్తూ నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎలా మిత్రుడయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరు సీఎం అయితే వాళ్లు తమ సన్నిహితులు అని మోహన్ బాబు చెప్పుకుంటారని, ప్లేట్ తిప్పేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.