సుప్రీమ్ హీరో @ గోల్డెన్ హార్ట్

సొసైటీకి తమకు వీలైనంత తిరిగి ఇద్దామనే ఆలోచన చాలా కొద్దిమంది సెలబ్రిటీలకే ఉంటుంది. అలాంటి కొద్దిమంది హీరోల్లో ఒకరు సాయి దుర్గతేజ్(Sai durgatej). కరోనా సమయం అయినా, ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భమైనా తన వంతు సేవా కార్యక్రమాలకు ముందుంటారీ సుప్రీమ్ హీరో. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్(Telangana CM relief fund) కు ఇచ్చారు సాయి దుర్గతేజ్.

ఈ రోజు విజయవాడ వెళ్లిన సాయి దుర్గతేజ్ అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం తను గతంలో దత్తత తీసుకుని, సొంత బిల్డింగ్ కట్టించిన అమ్మ అనాథాశ్రమానికి(Amma orphanage) వెళ్లారు. అక్కడి వారిని ప్రేమగా పలకరించి, వారి బాగోగులు తెలుసుకున్నారు. అలాగే అమ్మ అనాథాశ్రమానికి ఇస్తానని ప్రామిస్ చేసినట్లు 2 లక్షల రూపాయలు అందజేశారు. మిగతా ఛారిటీ సంస్థలకు 3 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఇలా సాయి దుర్గతేజ్ చేస్తున్న ఛారిటీ కార్యక్రమాలు, ఆయన చూపిస్తున్న మంచి మనసును ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మేనమామ పవన్ కల్యాణ్ సేవాతత్వాన్ని సాయి దుర్గతేజ్ అందుకున్నాడనే అప్రిషియేషన్స్ ఆయనకు వస్తున్నాయి.