“బలగం” నటుడు, గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత

పెద్దరికం, భైరవద్వీపం వంటి చిత్రాల్లో పాటలు రాసిన గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ(Vaddepalli krishna) అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఇటీవల అమెరికా అటా వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మళ్ళీ ఆస్పత్రిలో చేరిన వడ్డేపల్లి కృష్ణ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.

వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్ల లో చేనేత కుటుంబంలో జన్మించారు. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు. పెద్దరికం(Peddarikam), భైరవ ద్వీపం(Bhairava dhweepam), పిల్ల జమీందార్(Pilla zamindar) వంటి చిత్రాల్లో పాటలు రాశారు. వడ్డేపల్లి కృష్ణ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ” ఎక్కడికి వెళ్తుందో మనసు ” చిత్రంలో సాయి కుమార్ హీరోగా నటించారు. ఇటీవల “బలగం”(Balagam) సినిమాలో ఓ కీలక పాత్రలో ఆయన నటించారు.