“తండేల్”లో భారీ సాంగ్, ఖర్చు రూ.3 కోట్లకు పైనే

నాగచైతన్య(Naga chaitanya) హీరోగా నటిస్తున్న తండేల్(Thandel) సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జీఏ2(GA2 pictures) పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. భారత్, పాక్ మధ్య జరిగిన ఓ చారిత్రక ఘటన నేపథ్యంతో దర్శకుడు చందు మొండేటి రూపొందిస్తున్నారు. సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మూడొంతుల షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా పార్ట్ కూడా వేగంగా చిత్రీకరిస్తున్నారు.

ఇక తండేల్ లోని జాతర పాటను హైదరాబాద్ లో భారీ ఎత్తున రూపొందించారు. ఈ పాట కోసం దాదాపు వెయ్యి మంది డ్యానర్స్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పాటకే 3 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు అయ్యిందని టాక్ వినిపిస్తోంది. నాగ చైతన్య సినిమాలోని పాటకు ఇంత భారీ ఖర్చు పెట్టడం ఇప్పటిదాకా జరగలేదు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.