మర్చిపోతున్న ఇష్యూను గుర్తుచేస్తున్న అల్లు అర్జున్

ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్(Pawan Kalyan) జనసేన(Janasena) పార్టీకి ప్రచారం చేయకుండా వైరి వర్గం వైసీపీ నంద్యాల అభ్యర్థి కోసం ప్రచారం చేసి విమర్శల పాలయ్యారు హీరో అల్లు అర్జున్(Allu arjun). ఇంట్లో వాళ్లకు సపోర్ట్ చేయకుండా వారికి రాజకీయ శత్రువులైన పార్టీకి మద్ధతుగా ర్యాలీలు నిర్వహిస్తావా అంటూ మెగాభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ నాగబాబు వంటి వారు ప్రశ్నించారు. ఇది మెగా ఫ్యామిలీలోని విబేధాలు చూపిస్తుందంటూ బయట విస్తృతంగా టాక్ మొదలైంది. చెట్లు కొట్టే స్మగ్లర్స్ ను హీరోలుగా చూపిస్తున్నారంటూ అల్లు అర్జున్ పై పవన్ కూడా బెంగళూరు టూర్ లో కౌంటర్ వేశాడు.

ఈ నేపథ్యంలో నిన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ ఈ ఎలక్షన్స్ ఇష్యూను మరోసారి కెలికారు. నేను వెళ్లాలనుకుంటే నా ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వెళ్తా అంటూ తాను చేసింది కరెక్టేనంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ రీసెంట్ వ్యాఖ్యలపై మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.