కొత్త బాధ్యతల్లోకి సమంత

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవల నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు నిర్మిస్తోంది. తన నటిస్తూ మా ఇంటి బంగారం అనే సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. తాజాగా ఆమె మరో బాధ్యత తీసుకుంది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్(World pickle ball league) లో చెన్నై జట్టును కొనుగోలు చేసింది. చెన్నై జట్టుకు యజమానిగా మారింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

పికిల్ బాల్ అనేది టెన్నిస్ ను పోలిన ఆట. ఇందులో సింగిల్స్, డబుల్స్ ఆడొచ్చు. ఇటీవల మూవీ స్టార్స్ క్రికెట్, రేసింగ్, పోలో లీగ్స్ కొనుగోలు చేస్తున్నారు. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ చెన్నై టీమ్ కొనుగోలు ద్వారా సమంత కూడా ఎంటర్ ప్రెన్యూర్ గా మారింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది.