రాజ్ తరుణ్ కేసులో ఇరుక్కున్న మాల్వీ మల్హోత్రా

ఎంతో ఫ్యూచర్ ఎక్స్ పెక్ట్ చేసి టాలీవుడ్ కు వచ్చిన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా(Heroine Malvi malhotra) రాజ్ తరుణ్ (Raj tarun) తో ఎఫైర్ తో అనవసరంగా కేసులో ఇరుక్కుంది. ఆమె, ఆమె సోదరుడిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తో పాటు వీరికి కూడా నోటీసులు ఇచ్చారు. లావణ్య (Lavanya) ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మాల్వీ మల్హోత్రా సోదరుడిని రిజిస్టర్ చేశారు.

రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని, మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్నాడని కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. అలాగే రాజ్ తరుణ్ తన దగ్గర 70 లక్షల రూపాయలు తీసుకున్నాడని లావణ్య ఆరోపిస్తోంది. ఈ గొడవలతో రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరా సామీ రిలీజ్ ఆగిపోయేలా కనిపిస్తోంది.