దేవతైనా దెయ్యమైనా నేనే

సోషియో ఫాంటసీ చిత్రాలకు తననే అడుగుతున్నారని అంటోంది నటి మంచు లక్ష్మి. దేవతైనా దెయ్యమైనా నా దగ్గరకే దర్శకులు వస్తున్నారని ఆమె చెప్పింది. మంచు లక్ష్మి (manchu lakshmi) లీడ్ రోల్ చేసిన ఆదిపర్వం (Aadiparvam) సినిమా త్వరలో థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాలో నాగులాపురం నాగమ్మగా మంచు లక్ష్మి కనిపించనుంది. ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మోగోటి (sanjeev megoti). ఈ సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో

నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ – “ఆదిపర్వం” సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్ గారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు చేశా. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. సోషియో ఫాంటసీ క్యారెక్టర్స్, కథలు అంటే నా దగ్గరకే వస్తున్నారు. రీసెంట్ గా యక్షిణి వెబ్ సిరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు “ఆదిపర్వం” చేశాను. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్ అవుతున్నారు. ఆదిపర్వం నటిగా నాకు మంచి పేరు తెస్తుంది. అన్నారు.