Home Blog Page 524

Pawan Kalyan: జీతం తీసుకోకుండా పనిచేస్తానన్న పవన్ కల్యాణ్.. ‘అన్నా’ అంటూ దండం పెట్టిన ప్రముఖ డైరెక్టర్

0

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాఫురం ఎమ్మెల్యేగా గెలిచారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రజా సేవలో తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తాను జీతం తీసుకునే పని చేస్తానన్నారు పవన్ కల్యాణ్. జీతం తీసుకుంటూనే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి వేతనం తీసుకునే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖను రివ్యూ చేస్తున్న సమయంలో అక్కడున్న అప్పులు, లోటు బడ్జెట్ లను గురించి తెలుసుకున్న పవన్ తాను జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని ప్రకటించారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో ఫర్నీచర్ కూడా తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేసుకుంటానని వెల్లడించారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో ‘బ్రో’ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్ర ఖణి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ జీతం తీసుకోకపోవడంపై తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన ‘అన్నా’ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేశారు.

ప్రస్తుతం సముద్ర ఖణి ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సముద్ర ఖని తెరకెక్కించిన బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో వివాదాల్లోనూ నిలిచింది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ప్రస్తుతం సముద్రఖని జబర్దస్త్ నటుడు ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  రామం రాఘవం పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సముద్ర ఖని ట్వీట్ ఇదిగో..

పవన్ కల్యాణ్ తో డైరెక్టర్ సముద్ర ఖని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bellamkonda Sai Sreenivas: హిట్ కోసం రిస్క్ తప్పదు అంటున్న బెల్లంకొండ హీరో..

0

ప్రస్తుతం సౌత్‌లో ఫాంటసీ, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే బెల్లంకొండ హీరో కూడా ఇదే జానర్‌లో సినిమాకు రెడీ అవుతున్నారు. అయితే ఈ జానర్‌లో సినిమా అంటే భారీ బడ్జెట్‌ తప్పనిసరి, అదే సమయంలో సక్సెస్ రేష్యో చాలా తక్కువ. అందుకే సాయి శ్రీనివాస్ రిస్క్ చేస్తున్నారా? అన్న డిస్కష్ జరుగుతోంది.

Kalpana Rai: నటనతో కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్.. చివరి రోజుల్లో ఆకలితో అలమటించి.. ఆ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

0

Kalpana Rai: నటనతో కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్.. చివరి రోజుల్లో ఆకలితో అలమటించి.. ఆ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

తెలుగు తెరపై ఎంతో మంది హాస్యనటులు తమదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించారు. కామెడీ పంచులు, బాడీ లాంగ్వేజ్‏తో ప్రేక్షకులను అలరించారు. వందలాది చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటనతో ప్రేక్షకుల పెదాలపైకి నవ్వులు తెప్పించిన కమెడియన్లలో కల్పనా రాయ్. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో అప్పట్లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలతో మెప్పించింది. దాదాపు 430కు పైగా సినిమాల్లో నటించింది. జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా వంటి చిత్రాల్లో నటించింది. వందల సినిమాలు చేసి సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కల్పనా రాయ్.. చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది. కూతురు మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక వేదన అనుభవించింది. చివరకు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయింది.

కల్పనా రాయ్.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. 1950లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే రెండు కళ్లు చాలేవి కాదట. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నీడలేని ఆడది సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నవ్వించడం.. సెట్ లో అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేది. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేసేది. కానీ ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. ఆస్తి తగ్గగానే అందరూ దూరమయ్యారు. పెళ్లి చేసుకుండా ఒంటరిగా ఉన్న కల్పనా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ఓ అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది.

కూతురు వెళ్లిపోవడం.. డబ్బు ఆవిరి కావడంతో ఆమెను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించింది. ఎందరికో తన చేతులతో వండి కడుపునింపిన కల్పనా రాయ్ ఆకలికి తట్టుకోలేక ధీన స్థితిలో కన్నుమూసింది. ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితికు చేరుకుంది. అంతటి కష్టం ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు చేశారని గతంలో నటి జయ శ్రీ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపం !! ఆ విషయంలో.. జాన్వీ ప్లేస్‌ కబ్జా చేస్తున్న దిశా పటాని..

0

Prabhas: సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ప్రభాస్.. 

0

Rajamouli: మహేష్ ఫ్యాన్స్ లో కంగారు.. జక్కన్న పోగొడతారా ??

0

Tollywood: పోలికలు చూసి ఈ పిల్లాడు ఎవరో చెప్పగలరా? టాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. డైరెక్టర్ కమ్ హీరో

0

పై ఫొటోలో సూటు, బూటు వేసుకుని స్టైలిష్ గా పోజులిస్తోన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పగలరా? పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్. అంటే కేవలం హీరోగానే కాదు.. రైటర్ గానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించిన అతను తన ట్యాలెంట్ తో మొదట డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత హీరోగా అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు తీసే హీరోల్లో ఇతను కూడా ఒకడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ యాక్టర్ ను గుర్తు పట్టారా? మరి . కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. అతను మరెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో అడివి శేష్. ఇది అతని చిన్నప్పటి ఫొటో. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో స్టైలిష్ గా కనిపించే అడివి శేష్ చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నాడంటూ ఈ ఫొటోను చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా కెరీర్ ప్రారంభంలో సొంతం, కర్మ, పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, క్యామియో పాత్రలు చేశాడు అడివి శేష్. ఆ తర్వాత క్షణం సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత గూఢచారి, హిట్‌ 2, ఎవరు? మేజర్‌.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేష్ గూఢచారి 2, డెకాయిట్ తదితర సినిమాలతో బిజిబిజీగా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

డెకాయిట్ సినిమాలో అడివి శేష్, శ్రుతి హాసన్..

కాగా డెకాయిట్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు

గూఢచారి సినిమాలో అడివి శేష్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Divya Bharathi: అమ్మ బాబోయ్.. ఇంత క్యూట్ ఉన్నావేంటీ అమ్మాయ్.. దివ్య భారతి లుక్ అదిరిపోయింది..

0

బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్య భారతి. తొలి సినిమాతోనే హీరోయిన్‏గా ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

Disha Patani: దిశా పటానీ చేతిపై పచ్చబొట్టు.. ఆ స్టార్ హీరో పేరేనంటోన్న నెటిజన్స్

0

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే దిశా పటానీ గురించి ఒక గాసిప్ వేగంగా వ్యాపిస్తోంది. ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించిన దిశా పటాని ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంతటికీ కారణం దిశా పటానీ చేతిపై ఉన్నపచ్చ బొట్టు. దిశా పటానీ తన చేతిపై ‘పీడీ’ టాటూను వేయించుకుంది. దాని అర్థం ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ‘పీడీ అంటే ప్రభాస్, దిశా’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘డార్లింగ్ ప్రభాస్’ రివర్స్ వెర్షన్ అని మరికొందరు ఊహించుకుంటున్నారు. ప్రభాస్ తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

సినిమా షూటింగ్ లో తప్పితే ప్రభాస్, దిశా పటానీ ఎప్పుడూ కలిసి తిరిగింది లేదు. కాబట్టి వారి మధ్య ప్రేమ వ్యవహారం ఉండే ప్రసక్తి లేదంటున్నారు మరికొందరు నెటిజన్లు. పైగా ‘కల్కి 2898 AD’ సినిమా ప్రమోషన్‌ వర్క్‌లో దిశా పటానీ పెద్దగా పాల్గొనలేదు. ఓవరాల్ గా ప్రభాస్, దిశా పటానీ ఇద్దరూ దూరం మెయింటెన్ చేశాడు. అలాంటప్పుడు ప్రేమ ఎలా పుడుతుంది అనేది చాలా మంది ప్రశ్న. దిశా పటానీ తన చేతిపై కొత్త టాటూను చూసిన తర్వాత, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు రకరకాలుగా మాట్లాడటంతో ఆమె కూడా స్పందించింది . ‘నా టాటూపై ప్రజల ఆసక్తిని చూసి నేను సంతోషంగా ఉన్నాను’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది దిశా. అయితే ప్రభాస్ గురించి ఒక్క మాట మాట్లాడ లేదు.

ఇవి కూడా చదవండి

గతంలో దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసింది. అయితే తర్వాతి రోజుల్లో వారి మధ్య బ్రేకప్ అయింది. దిశాకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించి ఫేమస్ అవ్వానుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమెను 6 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Venkatesh: వెంకీ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్.. భార్యగా కనిపించనున్న ఆ బ్యూటీ.. ఎవరంటే..

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెమ్మదిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది. కానీ అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న వెంకీ.. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సైంధవ్ తర్వాత తన నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తుండగా.. ఈ మూవీలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలో మరో హీరోయిన్ కనిపించనుంది. తను మరెవరో కాదు.. ఐశ్వర్య రాజేశ్. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ప్రియురాలిగా మీనాక్షి కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరసు చిత్రాలతో అలరిస్తుంది ఐశ్వర్య రాజేశ్. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. కేవలం గ్లామర్ రోల్స్, హీరోయిన్ గా కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపించింది. చాలా కాలం తర్వాత తెలుగులో మంచి ఆఫర్ అందుకుంది. వెంకీ అనిల్ రావిపూడి సినిమాను రేపు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కామెడీ, యాక్షన్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.