Home Blog Page 523

Kalki 2898 AD: కల్కి విధ్వంసం.. హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు.. ఆ విషయంలో ప్రభాస్ ఏకైక హీరో..

0

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి వారాంతానికి 500 కోట్ల మార్క్‌ టచ్ చేసిన సినిమా మరోటి లేదు. నియర్‌ ఫ్యూచర్‌లో మరో సినిమాకు ఆ ఛాన్స్ ఉండే అవకాశం కూడా కనిపించటం లేదు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సునామి సృష్టిస్తుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ అదరగొడుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్.. బిగ్‌ కాస్టింగ్‌తో రూపొందించిన మూవీ… సంచలనాలు నమోదు చేస్తోంది. తాజాగా కల్కి ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.

పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డార్లింగ్ సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో ఉండే హంగామా గురించి చెప్పక్కర్లేదు. సింగిల్ స్క్రీన్ నుంచి మల్టిప్లెక్స్ వరకు అన్ని థియేటర్స్ కళకళలాడతాయి. ఇక వీకెండ్ మూడు రోజులు అయితే హౌస్ ఫుల్ కావాల్సిందే. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు సంబందించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. కల్కి రిలీజ్ రోజున అన్ని స్క్రీన్స్ లో కలిపి మొత్తం 40 షోల వరకు వేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం AMBలో రూ. కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఈ విషయాన్ని AMB స్వయంగా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు AMBలో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అంటున్నారు.

అలాగే హైదరాబాద్ నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించగా.. అక్కడ కూడా ఒక్కరోజే కల్కి సినిమా 42 షోలు వేయగా.. ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయ్యాయి. ఇక్కడ కూడా ఫస్ట్ టైం రూ. కోటి గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల్లోనే పది లక్షలు రాబట్టింది. ఇలాగే హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో కల్కి రిలీజ్ రోజున 36 షోలు వేయగా.. రూ.కోటి గ్రాస్ రాబట్టింది. ఇరవై ఏళ్లలో చాలా ఫాస్ట్ గా కోటి గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. దీంతో హైదరాబాద్ లో మూడు చోట్ల కల్కి రికార్డులు సెట్ చేసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Maname OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

0

Maname OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల మనమే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ టాక్ అందుకుంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. రోటిన్ స్టోరీ అయినా.. డైరెక్షన్, శర్వానంద్, కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. భారీగా కలెక్షన్స్ వసూలు చేయకపోయినా నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది ఈ మూవీ. థియేటర్లలో పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, కృతి కలిసి నటించిన మనమే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రాహుల రవీంద్రన్, శివ కందుకూరి కీలకపాత్రలు పోషించగా.. ఖుషి మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో మొత్తం పదహారు పాటలు ఉన్నాయి.

కథ విషయానికి వస్తే..
విక్రమ్ (శర్వానంద్) ప్రాణ స్నేహితుడు, అతడి భార్య ఓ ప్రమాదంలో కన్నుమూస్తారు. వాళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యత విక్రమ్ తోపాటు సుభద్ర (కృతి శెట్టి)పై పడుతుంది. దీంతో ఖుషి కోసం పెళ్లి కాకుండా తల్లిదండ్రులుగా మారతాయి. వారిద్దరి జీవితంలోకి ఖుషి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), కార్తీక్ (శివ కందుకూరి) ఎవరు ? అనేది తెలియాలంటే మనమే సినిమా చూడాల్సిందే. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన మనమే మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Darshan: ‘పిచ్చి అంటారు సార్ దీన్ని’.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా

0

Darshan: ‘పిచ్చి అంటారు సార్ దీన్ని’.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు. దర్శన్ ను కోర్టుకు తీసుకెళ్తుండగా.. షూటింగ్ జరుగుతోందంటూ అభిమానులు ‘డి బాస్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. దర్శన్ పై ఉన్న అభిమానంతో కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘బ్రాండ్ ఆఫ్ శాండల్‌హుడ్ డి బాస్ ఫ్యాన్స్ మైసూర్’ అనే సోషల్ మీడియా ఖాతా లో ఈ పిల్లాడి ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఏడాది వయసున్న చిన్నారిని ఖైదీ వేషధారణలో ముస్తాబు చేశారు. దర్శన్‌కు ఇచ్చిన అండర్ ట్రయల్ ఖైదీ నంబర్‌ 6106నే చిన్నారి డ్రెస్ పై కూడా వేయించారు. పిల్లాడి పక్కన ‘జై డి బాస్’, ఖైదీ నంబర్ 6106 అంటూ అక్షరాలు కూడా ఏర్పాటుచేశారు.

ఈ ఫొటోను చూసిన దర్శన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
ఖైదీ వేషధారణలో చిన్నారి ఫొటో తీయడం దారుణమంటూ సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెట్టింట విస్తృతంగా చర్చ జరుగుతోంది. ‘ఇలా చేయడం అభిమానం అనిపించుకోదు.. పిచ్చి అంటారు దీన్ని’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

 

కాగా నటుడిపై ఉన్న పిచ్చి ప్రేమ కోసం అభిమానులు ప్రతిరోజూ ట్రెండ్ అవుతున్నారు. కొందరు దర్శన్ అండర్ ట్రైయల్ ఖైదీ నంబర్ ను టాటూలుగా వేయించుకున్నారు.

6106 నంబర్ ను పచ్చ బొట్టుగా వేయించుకుంటోన్న అభిమానులు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Samantha: నువ్వు ఒక వారియర్.. నీకోసం ప్రార్థిస్తుంటాను.. వైరలవుతున్న సమంత పోస్ట్..

0

అతి తక్కువ సమయంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సమంత. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సామ్.. గత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించగా.. ఆ తర్వాత ఎలాంటి వివరాలు అనౌన్స్ చేయలేదు. అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో సామ్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. సినిమాల్లో సైలెంట్ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్స్ ఇస్తూ.. అలాగే కొన్ని పోస్టులు కూడా పెడుతుంది.

తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్‏ కోసం ఆసక్తికర పోస్ట్ చేసింది. హీనా ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ దశలో ఉందంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక ఇతాజాగా తాను కీమోథెరపీ సెషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేసింది. ఇక హీనా ఖాన్ పోస్టుకు సమంత రియాక్ట్ అవుతూ “నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు యోధురాలివి” అంటూ ఇన్ స్టా స్టోరీలో హీనాకు ధైర్యం చెప్పింది.

Samantha, Hina Khan

Samantha, Hina Khan

ఇక సమంత పోస్టుకు హీనా ఖాన్ స్పందిస్తూ.. “ఒకరిని తీసుకున్నాకే మరొకటి తెలుసుకోవడం జరుగుతుంది. మీరు నిజమైన స్టార్ అని నాకు తెలుసు. ఎందుకంటే జీవితంలో ఎదురైన అడ్డంకులను మీరు ఎదుర్కొన్న విధానం అద్భుతమైనది. మీరు చాలా ప్రేమ, ఆశీర్వాదాలు ” అంటూ రాసుకొచ్చింది. హే రిష్తా క్యా కేహలతా హై సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kalki 2898 AD: ప్రభాస్ క్రేజ్ అంటే ఇది.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న కల్కి.. ఆ రికార్డ్ డార్లింగ్‏కే సొంతం..

0

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుతమైన విజువల్ వండర్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది కల్కి. భారతీయ పురాణాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, కమల్, దీపికా, విజయ్ దేవరకొండ యాక్టింగ్ మరో హైలెట్ అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉగ్రరూపం దాల్చుతోందనే చెప్పాలి. మొదటి రోజే రూ. 191.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇటు ఐదు రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలాగే అదే స్థాయిలోనూ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు వారం రోజులు కాకుండానే రూ.500 కోట్లను క్రాస్ చేసింది కల్కి.

సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ప్రకారం సోమవారం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి రూ.600 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.625 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియాలో రూ.343.6 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.182 కోట్లు రాబట్టినట్లు సమాచారం. Sacnilk ప్రకారం నార్త్ ఇండస్ట్రీలో రూ.128 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ప్రాంతాలలో ఈ సినిమా జోరు కొనసాగుతుంది.

అలాగే కల్కి మరో ఘనతను సాధించింది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్స్ డాలర్లు వసూళ్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి నిలిచింది. ఇక ఇదే జోరు కొనసాగితే త్వరలోనే కల్కి రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారాంతంలో కల్కి రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Allu Arjun – Pushpa 2: పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్‌.. పార్టీ గట్టిగానే ప్లాన్ చేసాడు..

0

Tollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

0

Tollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా దర్శనమిస్తోన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆర్జీవీ తీసిన పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ సొగసరి పలువురి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తన కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ మూవీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా లుక్ మార్చిఅందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈ కాళీ మాతను గుర్తు పట్టారా? ఈమె మరెవరో కాదు ‘భూమ్ బద్దలు’ పాటతో కుర్రకారును హుషారెత్తించిన అప్సరా రాణి. సోమవారం (జులై 01) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ అరాచకం నుంచి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, నెత్తురితో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే అప్సరా రాణి ఇలా మారిపోయిందేంటా? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాచరికం సినిమాలో అప్సరా రాణితో పాటు విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో హైపర్ ఆది, మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, మెంబూబ్ బాషా, పాచి థాకర్, రూపేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంగి సంగీతం అందిస్తుండగా, ఆర్య సాయి కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాచరికం సినిమాలో అప్సరా రాణి..

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

అప్సరా రాణి లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

 

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన ఒకే ఒక్క యాడ్ ఏంటో తెలుసా..? ఆ విషయంలో మాత్రం ఏకైక హీరో..

0

తెలుగు రాష్ట్రాల్లో ఆ హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లు హౌస్ ఫుల్ కావాల్సిందే. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పవన్.. బద్రి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తమ్ముడు, ఖుషి వంటి చిత్రాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకున్నాడు. పవన్ యాక్టింగ్, మేనరిజంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోగా అభిమానుల గుండెల్లో దైవంగా ఉన్నారు. పవన్ రియల్ లైఫ్ హీరో అంటూ ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న పవన్.. దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.

పవన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. యూత్ మాత్రమే కాదు.. సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ వ్యక్తిత్వానికి అభిమానులే. ఇదంతా పక్కన పెడితే దాదాపు రెండు దశబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ఇన్నేళ్లలో పవన్ కేవలం ఒకే ఒక్క యాడ్ చేశారు. కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన మొదటి యాడ్ పెప్సీ. 2001లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది. అప్పట్లో పెప్సీ కూల్ డ్రింగ్ సంస్థకు పవన్ బ్రాండ్ అంబాసిడర్. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ప్రొడక్ట్స్ యాడ్ ఇవ్వడం అదే తొలిసారి. ఆ తర్వాతే మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ ఇచ్చారు.

అప్పట్లో ఎక్కడ చూసిన పవన్ పెప్సీ యాడ్ పోస్టర్ కనిపించేవి. అప్పట్లో పెప్సీ యాడ్ చేసినందుకు ఆయనకు రెమ్యునరేషన్ అధికంగానే ఇచ్చారట. ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ ఏకంగా రూ.70 నుంచి రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని సమాచారం. అప్పట్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో పవన్. ఆ తర్వాత పవన్ మరో యాడ్ చేయలేదు. కేవలం సినిమాలపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Pawan

Pawan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Actor Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా..? ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ వైరల్..

0

ఒకప్పుడు సౌత్ ఇండియాలో లవర్ బాయ్. యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకూమారుడు. మొదటి సినిమాతోనే హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రేమకథ చిత్రాలతో అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఆ హీరో హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా ట్రెండ్. కుర్రాళ్లు ఆ హీరో హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవారంటే అప్పట్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అతడు మరెవరో కాదు.. హీరో అబ్బాస్. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే సినిమా ప్రేమ దేశం. 1996లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే అబ్బాస్ చాలా పాపులర్ అయ్యాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రేమ దేశం తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాలో ఎంపికలో పొరపాట్లతో స్టార్ హీరోగా ఇమేజ్ తగ్గిపోయింది. దీంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి.

అనేక సినిమాల్లో సెకండ్ హీరోగా కనిపించడం.. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోగా కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై అబ్బాస్ కనిపించడం తగ్గిపోయింది. చివరగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించాడు. తెలుగు, తమిళ్ భాషలలో మొత్తం 50కు పైగా చిత్రాల్లో కనిపించిన అబ్బాస్.. తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమయ్యాడు. యాడ్స్ చేస్తూ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చిన అబ్బాస్.. ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ఓ మోటివేషనల్ స్పికర్ గా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అబ్బాస్ సినిమాల గురించి తప్పా.. అతడి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికి తెలియదు. కానీ అబ్బాస్ భార్య, పిల్లలు మాత్రం చాలా అందంగా ఉంటారు. అబ్బాస్ 1997లో ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామీలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా కూతురు ఏమిరా అలి లేటేస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్స్ ను మించిన అందంతో.. చూడగానే ఫిదా అయ్యాలా కనిపిస్తుంది. ప్రస్తుత అబ్బాస్ ఫ్యామిలీ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Abbas Daughter

Abbas Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులో చూడొచ్చంటే?

0

కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. ఓటీటీల్లో కూడా కొరియన్ కంటెంట్ కు బాగా ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొరియన్ సినిమాలను, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఆయా భాషల వారికి సులభంగా అర్థమయ్యేలా డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. అలా కొరియన్ సినిమాలను ఇష్టపడే వారి కోసం మరో సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్. సుమారు ఏడేళ్ల క్రితం కొరియన్ థియేటర్లలో రిలీజైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఇండియాలో డైరెక్టుగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్‍ లాంగ్వేజ్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

భర్త, కుమారుడు ఎలా చనిపోయారు?

హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ సినిమాకు లిమ్ డీ వూంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో యుంజిన్ కిన్, కే పాప్ స్టార్ ఓకే టయిక్ ఇయాన్, జా జయీ యూన్, పార్క్ సంగ్ హూన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిత్మికల్ గ్రీన్, జియాన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాకు కిమ్ వూ గెయిన్ సంగీతం అందించారు. ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే.. భర్త, కొడుకును హత్య చేశారనే తప్పుడు ఆరోపణలతో హీ (యుంజిన్ కిమ్) 25 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటికి తిరిగి వెళుతుంది. తన భర్త, కొడుకు చావుకు కారణాలేంటో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలంటే హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ చూడాల్సిందే. కొరియన్ సినిమాలు అందులోనూ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.