Home Blog Page 519

Deepika Padukone: ఏంటీ..! దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!

0

ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు సినీ లవర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ కల్కి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదలై భారీ హిట్ సొంతం చేసుకుంది. మహాభారతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సైన్స్ ఫిక్షన్ ను మిక్స్ చేసి ఈ సినిమాను అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించాడు నాగీ. ఇక ఈ సినిమాలో లెజెండ్రీ యాక్టర్స్ ఉన్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. మొదటి సారి కమల్ హాసన్ నెగిటివ్ పాత్రలో కనిపించాడు. అలాగే అమితాబ్ బచ్చన్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే చాలా మంది నటీనటులు ఈ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దీపికా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న దీపికా ఈ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే టాలీవుడ్ లో దీపికా చేసిన మొదటి సినిమా ఇది కాదు.. గతంలో టాలీవుడ్ లో సినిమా చేసింది దీపికా ఆ సినిమా ఎదో తెలుసా.?

టాలీవుడ్ సినిమాలో దీపికా పదుకొనె ఓ స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో దీపికా కనిపించింది. ఈ సినిమాలో రణదీప్, మృదుల అనే కొత్త జంట నటించారు. జయంత్ సి పరాన్జీ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ దీపికా ఆ సాంగ్ చేసింది. కాకపోతే అప్పటికి దీపికా అంత ఫెమ్స్ కాకపోవడమతొ చాలా మందికి ఆ విషయం తెలియకుండా పోయింది. ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు దాంతో దీపికా ను జనాలు మరిచిపోయారు. ఇలా కల్కి కంటే ముందే దీపికా టాలీవుడ్ లో మెరిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవుర్రా నువ్వూ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..! రాకీ భాయ్‌లా ఫీల్ అయ్యాడు.. కట్ చేస్తే

0

ఎవుర్రా నువ్వూ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..! రాకీ భాయ్‌లా ఫీల్ అయ్యాడు.. కట్ చేస్తే

సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఆ మధ్య టిక్ టాక్ అంటూ కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేశారు. మరికొంతమంది ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. దాంతో మనదగ్గర ఆ మాయదారి యాప్‌ను మనదగ్గర బ్యాన్ చేశారు. ఇక ఇప్పుడు అందరూ ఇన్ స్టా గ్రామ్ మీద పడ్డారు. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ రీల్స్ చూస్తుంటే అమ్మబాబోయ్ అనకుండా ఉండలేరు. ఎక్కడ లేని టాలెంట్ అంతా ఈ ఇన్ స్టా గ్రామ్‌లోనే కనిపిస్తుంది. కొంతమంది తమ యాక్టింగ్‌తో, డాన్స్‌తో, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం పిచ్చి పిచ్చిచేష్టలతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు.  సినిమాలో హీరోలను చూసి వారిలానే వీడియోలు చేసి పాపులర్ అవ్వాలనుకుంటున్నారు. తాజాగా ఇలానే ఓ వ్యకి చేసిన పనికి జనాలు షాక్ అయ్యారు.

సోషల్ మీడియా పిచ్చితో కొంతమంది చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్ని సార్లు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అరుణ్ కటారే అనే వ్యక్తి అరెస్టయ్యాడు. డమ్మీ తుపాకీని ఉపయోగించి పబ్లిక్‌గా రీల్స్  తయారు చేసినందుకు బెంగుళూరులోని కొత్తనూరు పోలీసులు అరెస్టు చేశారు. వీధుల్లో తుపాకీ పట్టుకుని తిరుగుతూ హల్ చల్ చేశాడు.  అతడిని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దాంతో పోలీసులు అరుణ్‌ని అరెస్టు చేశారు. అరుణ్ తప్పిదం వల్ల ఇప్పుడు శాండల్ వుడ్ కష్టాల్లో పడింది. కన్నడ హిట్ సినిమాలకు డమ్మీ గన్స్ అందించే టెక్నీషియన్ సాహిల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు

హోంబలే ఫిల్మ్స్, గీతా పిక్చర్స్ వంటి బ్యానర్ల సినిమాలకు సాహిల్ డమ్మీ గన్‌లు ఇచ్చేవాడు. ‘కబ్జా’, ‘మఫ్తీ’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో తుపాకులను విరివిగా వాడారు. ఈ సినిమాలకు సాహిల్ డమ్మీ గన్ అందించాడు. అరుణ్ అనే వ్యక్తి చేసిన పనికి సాహిల్ కి నోటీసు ఇచ్చారు పోలీసులు. అరుణ్ కటారే సాహిల్ దగ్గర డమ్మీ తుపాకీని అద్దెకు తీసుకున్నాడు. ఈ తుపాకీని పబ్లిక్ ప్లేస్‌లో రీల్స్ చేసేందుకు ఉపయోగించారు. సాహిల్‌పై ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో అరుణ్‌ని కొత్తనూరు పోలీసులు అరెస్టు చేశారు. అరుణ్‌ని విచారించగా, సాహిల్‌ నుంచి డమ్మీ గన్‌ తీసుకున్నట్టు తెలిపాడు. దీంతో కొత్తనూరు పోలీసులు సాహిల్‌కు నోటీసులు ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దర్శన్ నాకు పెద్ద కొడుకులాంటి వాడు.. నిజం బయటకు రావాలి.. సుమలత కామెంట్స్

0

నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కుటుంబానికి దర్శన్ సన్నిహితుడు అన్న విషయం చాలా మందికి తెలుసు.  అయితే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత సుమలత అంబరీష్ స్పందించలేదు. ఇప్పటికే చాలా మంది దీన్ని పై స్పందించారు. కొంతమంది దర్శన్ కు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది దర్శన్ ను తప్పుబడుతున్నారు. సుమలత అంబరీష్ దర్శన్ కేసు పై మాట్లాడకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దర్శన్ అరెస్టుపై సుమలత తాజాగా స్పందించారు. దీని పై ఓ సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుమలత.

అందరికీ నమస్కారం.. 44 ఏళ్లుగా నటిగా, కళాకారిణిగా, గత 5 ఏళ్లుగా ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నాను. అలాగే, ఒక నటిగా.. భార్యగా, తల్లిగా, పార్లమెంటేరియన్‌గా అలాగే ఓ వ్యక్తిగా నా జీవితంలో ప్రతి బాధ్యతను నేను సీరియస్ గా తీసుకున్నాను. సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎలాంటి వాస్తవాలు లేదా సమాచారం లేకుండా నిర్లక్ష్యంగా, అనవసరంగా, బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయలేను. ఈ రోజు నేను కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి, నా ఆలోచనలు, బాధలను పంచుకోవడానికి పోస్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే నేను మీడియాలో లేదా సోషల్ మీడియాలో ఊహాగానాలను ప్రోత్సహించకూడదనుకుంటున్నాను. నా కామెంట్స్ అభిమానులలో ఎటువంటి గందరగోళాన్ని కలిగించకూడదు.

కొడుకును, భర్తను కోల్పోయిన హృదయవిదారకమైన రేణుకాస్వామి తల్లిదండ్రులకు, భార్యకు ముందుగా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మన న్యాయ వ్యవస్థ నుంచి వారికి తగిన న్యాయం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది. నేను చాలా రోజులపాటు దానిని అర్థం చేసుకోలేక షాక్, బాధతో ఉన్నాను. నా “నిశ్శబ్దం”పై వ్యాఖ్యానిస్తున్న కొంతమందికి నాకు, దర్శన్‌కు మధ్య ఉన్నరిలేషన్, అతని కుటుంబం, మేము సంవత్సరాలుగా పంచుకున్న బంధం అర్థం కావడం లేదు. అతను స్టార్, సూపర్ స్టార్ కాకముందు నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. ఆ స్టార్ డమ్ కంటే, అతను నా కుటుంబంలో సభ్యుడు, నాకు కొడుకు లాంటివాడు. అంబరీష్‌ను ఎప్పుడూ తన తండ్రిగా భావించి.. నాకు తన తల్లి గౌరవం, స్థానం, కొడుకు ప్రేమను ఇచ్చారు.

ఏ తల్లి తన బిడ్డను ఇలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోదు. దర్శన్ ప్రేమగల హృదయంతో చాలా శ్రద్ధగల, ఉదారమైన వ్యక్తి అని నాకు తెలుసు. జంతువుల పట్ల అతని ప్రేమ, సహాయ స్ఫూర్తి ఎల్లప్పుడూ అతని స్వభావంలో ఒక భాగం. ఈ పని చేసే వ్యక్తిత్వం దర్శన్‌ది కాదని నేను నమ్ముతున్నాను. ఈ కేసు కోర్టులో ఉన్నందున, ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయలేను. సోషల్ మీడియాలో దర్శన్‌తో పాటు అతని భార్య విజయలక్ష్మి, కొడుకును టార్గెట్ చేయడం చాలా అన్యాయం. దీంతో పాటు మిగతా నిందితుల నిరుపేద కుటుంబాలు కూడా అవస్థలు పడుతుండటం బాధాకరం. సోషల్ మీడియా వినియోగదారులు, పబ్లిక్ కామెంట్స్ ఇప్పటికే ఈ భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న బాధితురాలి లేదా నిందితుల కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించాలి. విచారణ కొనసాగుతోంది, పోలీసులు వారి పనిని చేస్తున్నారు అలాగే మన న్యాయ వ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ కేసులో దర్శన్ నిందితుడు అని ఇంకా ఏదీ రుజువు కాలేదు లేదా దోషిగా నిర్ధారించబడలేదు. ఈ విషయంలో ఇప్పటికే తీర్పు ఇవ్వడం , శిక్షించడం చట్టానికి సంబంధించినది మరెవరూ కాదు.

ఈ పరిస్థితిలో, నేను ఈ సమస్య నుంచి దూరంగా ఉండటం అసాధ్యం. ఇది నా స్వంత కుటుంబ సమస్య. ఇది వారి జీవితం లేదా కుటుంబ సౌఖ్యం, భద్రత, భవిష్యత్తుకు సంబంధించి చాలా తీవ్రమైన విషయం. మేమంతా బాధ పడుతున్నాం. సినిమా పరిశ్రమ అస్తవ్యస్తంగా ఉంది. ఆయన సినిమా నిర్మాణాలపైనే వేలాది మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. దీన్ని ఎదుర్కోవడం ఎవరికీ అంత సులభం కాదు. నిందించబడడం అంటే అతను దోషి అని అర్థం కాదని గుర్తుంచుకోండి. చట్టబద్ధంగా తమను తాము రక్షించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. దర్శన్ నన్ను మదర్ ఇండియా అని పిలుస్తాడు. నేను జీవించి ఉన్నంత వరకు అతను నాకు పెద్ద కొడుకుగా ఉంటాడు. మా బంధం ఒకటి, దానిని ఏదీ మార్చదు. నిజం బయటకు రావాలని, అందరికీ న్యాయం జరగాలని వారి తల్లిగా నేను నిరంతరం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారు తమను తాము నిర్దోషులుగా నిరూపించుకుని బయటకు వచ్చి చిత్రీకరణ, సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. దర్శన్ అభిమానులకు హృదయపూర్వక అభ్యర్థన, దయచేసి ప్రశాంతంగా ఉండండి, ఈ తరుణంలో అతని కుటుంబం లేదా ప్రియమైన వారిని ప్రభావితం చేసే ఎలాంటి ప్రతికూలతతో ప్రకటనలు చేయవద్దు. మనలో ఎవరూ చట్టానికి అతీతులు కాదు మరియు మనం దానిని గౌరవించాలి.. ఓపికగా వేచి ఉండాలి. మంచి సమయాలు తిరిగి రావాలని ప్రార్థించండి. మన న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచండి. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి. అంతా బాగానే ఉంటుంది అంతా మంచి జరుగుతుంది. సత్యమేవ జయతే. అని రాసుకొచ్చారు సుమలత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Nayanthara: ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..

0

NTR – Devara: అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!

0

ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంతవరకు తారక్‌ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్, సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది.

Entertainment: బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు.. | ఓజి పై మాటలు కామెంట్స్.

0

Disha Patani: దిశా పటానీ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ చెప్పేసిన కల్కి హీరోయిన్

0

Hardik Pandya: నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? వైరలవుతోన్న లేటెస్ట్ పోస్ట్

0

Kalki 2898 AD: గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!

0

కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తోంది. దాంతో పాటే టికెట్ రేట్స్‌ మరీ ఇంతనా అనే కామెంట్ కూడా నెట్టింట వచ్చేలా చేస్తోంది. అయితే కల్కి టికెట్ రేట్‌ చూసి.. సినిమాకు వెళ్లకుండా ఉన్న వారికి ఇప్పుడో గుడ్ న్యూస్. ఈ మూవీ టికెట్స్‌ రేట్స్ వచ్చే వారం నుంచి తగ్గుతున్నాయన్నదే ఆ న్యూస్. కల్కి మూవీ హై బడ్జెట్‌తో తెరకెక్కడంతో..ఈ మూవీ టికెట్ రేట్స్ ఓ వారం పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్.. 14 రోజులు పెంచుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. మేకర్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రిలీజ్ చేసిన జీవోను అనుసరించే.. టికెట్స్ రేట్ పెంచింది. ఇక తెలంగాణలో ఈ గడువు వచ్చే వారంతో ముగుస్తుండడంతో.. మళ్లీ కల్కి టికెట్ రేట్స్‌ ఎప్పటిలానే నార్మల్‌కు వస్తున్నాయి. అంటే మల్టీప్లెక్స్‌లో టికెట్‌ ధర 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలకు కల్కి మూవీ టికెట్ రేట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫిల్మ్ లవర్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వేణు స్వామి! ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే! రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్!

0

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 8 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బహుశా ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్‌లో వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రముఖుల జాతకాలు.. అందులోనూ సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తోన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈ స్వామి మనసులో ఏదీ దాచుకోడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా కావాల్సింది ఇదే. ఇలాంటి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తుల వల్ల బిగ్ బాస్ కు అవసరమైన కంటెంట్ వస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేణు స్వామిని హౌజ్‌లోకి రప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

కాగా వేణు స్వామి బయట పూజలు చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు సుమారు 100 రోజుల పాటు స్వామి బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలనుకుంటే అంతకు మించే దక్కాలి. అందుకే ఆయనకు ఈ సీజన్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమై బిగ్ బాస్ హౌజ్ లోకి వేణు స్వామి గనుక ఎంట్రీ అయితే మాత్రం ఎంటర్ టైన్మెంట్ కు కొదవ ఉండదని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కన్నడ హీరోయిన్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు

వీరు కూడా..

కాగా బిగ్ బాస్ సీజన్ 8 లో కుమారి ఆంటీతోపాటు బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ తదితరులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రహ్మమూడి ఫేమ్ కావ్య కూడా ఈ సారి హౌస్ లోకి రానున్నట్లు టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.