Home Blog Page 518

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

0

అబ్బాస్! ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఈ హీరో.. ఇప్పుడు సినిమాలకు దూరంగా మోటివేషనల్ స్పీకర్‌ గా బిజీగా ఉంటున్నారు. న్యూజిలాండ్లోనే తన ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయిపోయారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇక అబ్బాస్ సినిమాల గురించి తప్పా.. అతడి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికి అంతగా తెలియదు. అయితే ఈ క్రమంలోనే ఈ హీరో కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండియన్ సినిమాకు నయా హీరోయిన్ దొరికిందనే కామెంట్లు వస్తున్నాయి. ఇక అబ్బాస్ 1997లోనే ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామీలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులోనూ కూతురు ఏమిరా అలి లేటేస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్స్ ను మించిన అందంతో.. చాలా అందంగా కనిపిస్తోంది. చూడగానే అందరూ ఫిదా అయ్యాలా చేస్తోంది. ఈ కారణంగానే నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు

Nag Ashwin: ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు.. కల్కి పార్ట్ 2 పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0

‘కల్కి 2898 ఏడీ’ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు ఫ్యాన్స్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా కుమ్మేస్తుంది. అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇప్పుడు సినిమా మొదటి భాగం మాత్రమే విడుదలైంది. సినిమా రెండో భాగం ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ఇటీవలే మేకర్స్ మాట్లాడుతూ కల్కి రెండవ భాగం 60శాతం షూటింగ్ జరిగింది అని హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ్ అశ్విన్.. కల్కి పార్ట్ 2 గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెకండ్ పార్ట్ 60% చిత్రీకరించినట్లు వస్తున్న వార్తలపై నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..

‘కొన్ని భాగాలు చిత్రీకరించాం కానీ 60 శాతం చిత్రీకరణ అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు 25-30 రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. రెండో భాగానికి సంబంధించిన చాలా సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ఇంకా చిత్రీకరణకు కావాల్సినంత సన్నాహాలు చేయాల్సి ఉంది. కల్కి రెండవ భాగం కోసం మేము డిజైన్‌తో ప్రారంభించాలి. లొకేషన్, సెట్, కాస్ట్యూమ్, క్యారెక్టర్స్ అన్నీ డిజైన్ చేసి ఆ తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఐతే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచం వర్క్ చేస్తే చాలు. నటీనటులను సెట్‌కి తీసుకురావడానికి మరింత సమయం పడుతుంది’ అని నాగ్ అశ్విన్ అన్నారు.

‘కల్కి 2898 AD’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిమించారు. ఈ చిత్రం దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాత అశ్విని దత్. ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇదే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన  ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీలతో పాటు పలువురు స్టార్ నటీనటులు ఉన్నారు. సినిమా మొదటి భాగం మాత్రమే పూర్తయింది అసలు కథ సెకండ్ పార్ట్ లో ఉంటుందని తెలుస్తోంది.  మరి రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Brahmamudi, July 5th Episode: అనామిక సంగతి ఇక మటాష్.. ట్విస్ట్ ఇచ్చిన కావ్య!

0

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ గదిలో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన కావ్య.. ఏం ఆలోచిస్తున్నారు? ఇంట్లో అందరూ కవి గారికే శిక్ష పడుతుందని అనుకుంటున్నారని అంటుంది. అవును పరిస్థితి చూస్తే అలానే ఉందని రాజ్ అంటాడు. ఏవండీ మనం ఒకసారి వెళ్లి అనామికతో మాట్లాడి వద్దామని కావ్య అంటే.. రాజ్ సీరియస్ అవుతాడు. ముందు మీ తమ్ముడికి శిక్ష పడకుండా బయటకు తీసుకురావడమే ముఖ్యం. ఇంత బలగం, బలం ఉండి కూడా ఒక అమాయకుడికి శిక్ష పడటం ఎంత వరకూ కరెక్ట్ అని కావ్య చెప్తుంది. న్యాయ స్థానం ముందు బలం, బలగం పనికి రావు.. ఇది ఎంత దూరం వెళ్లిందో నీకు అర్థం కావడం లేదని రాజ్ అంటాడు. ఇంకా ఒక అవకాశం మిగిలే ఉంది. మనం అనామిక ఇంటికి వెళ్లి మాట్లాడదామని కావ్య అంటే.. అది చాలు మనం వెళ్లి వాళ్ల ఇంటి మీద దాడి చేశామని మరో కేసు పెడతారు.

నువ్వు ఇక పుట్టింటి నుంచి అత్తింటికి రావు..

మనుషులా వాళ్లు.. కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇది డబ్బు సమస్య కాదు. కళ్యాణ్ కోసం ఎవరైనా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్లి కేసు వాపస్ తీసుకోమని మాత్రం నేను వెళ్లను.. నువ్వు వెళ్తే వెళ్లు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య.. అనామిక ఇంటికి వస్తుంది. కావ్యని చూసి అనామిక వెటకారంగా నవ్వుతుంది. కాలి మీద కాలు వేసుకుని ఊపుతూ ఉంటుంది. అనుకున్నాను.. నా పుట్టింటిని వెతుక్కుంటూ.. నా అత్తింటి నుంచి రాయబారానికి వస్తారని అనుకున్నానని అనామిక అంటుంది. రాయబారానికి వచ్చిన వాళ్లను గౌరవంగా చూస్తారు. కానీ నువ్వు ఇప్పుడు కూర్చోమనకుండా.. కాలి మీద కాలు వేసుకుని కూర్చొంటే అర్థమైందని కావ్య అంటుంది. ఏం అర్థమైందని అనామిక అంటే.. నువ్వు ఇక పుట్టింటి నుంచి అత్తింటికి రావని కావ్య అంటుంది. ఇంకా నేను అక్కడికి ఎందుకు వస్తాను. కళ్యాణే ఇక్కడికి వస్తాడని అంటుంది.

నాకు కోట్లు కావాలి..

నువ్వు ఎన్ని గొడవలు పడ్డా ఒపికగానే ఉన్నాడు కదా అని కావ్య అంటే.. ఆ ఓపిక నాకు ఎందుకు? బిజినెస్ చూసుకోవాలి.. కోట్లు సంపాదించాలి.. అదంతా తెచ్చి నా ముందు కుమ్మరించాలి. అలాంటివి చేతకాని మనిషికి ఇలానే బుద్ధి చెప్పాలని అనామిక అంటే.. అంటే నువ్వు కళ్యాణ్‌ని ప్రేమ కోసం కాదా.. ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా? అని కావ్య అడిగితే.. అంతేగా అందుకే చేసుకున్నా. నాకు లగ్జరీ యస్‌గా ఉండటం ఇష్టమని అంటుంది అనామిక. నీకు ఎంత కావాలో అంత వాళ్లు ఇచ్చేస్తారు కదా.. కళ్యాణ్ సంతకం చేసిన చెక్కు మీద పది లక్షలు నువ్వు మీ నాన్న పేరు రాసి ఇచ్చినప్పుడే ఎవరికీ తెలీదు అనుకున్నావా? అయినా నీ విలువ కాపాడారు. అంత తక్కువ డబ్బుతో నాకెందుకు.. నాకు కోట్లు కావాలని అనామిక అంటే.. అర్థమైంది.. నీ పుట్టింటి వాళ్లక ఎన్ని కోట్లు అప్పు ఉందో అర్థమైంది. వాళ్లకు దోచి పెట్టడానికే కదా.. కళ్యాణ్‌ని ఇబ్బంది పెడుతున్నావ్? అందుకే ఇక్కడి దాకా లాక్కొచ్చావని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్.. నా కాళ్ల దగ్గరకు రాక తప్పదు..

అవును నా పుట్టింటి అప్పులు తీర్చడానికే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు ఇంత గొడవ జరిగితే అయినా కూడా అందరూ దిగి వస్తారు. దుగ్గిరాల వంశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. వాళ్లు ఎప్పుడూ పరువు, ప్రతిష్ఠ అంటారు. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ నా కాళ్ల బేరానికి వస్తాడని అనామిక అంటుంది. నువ్వు చాలా కలలు కంటున్నావ్ అనామిక అని కావ్య అంటే.. లేదు నేను చాలా తెలివిగా, పకడ్బందీగా కేసులో ఇరికించాను. చట్టాలు అన్నీ ఆడవాళ్లకే అనుకూలంగా ఉంటాయి. కళ్యాణ్ జైలుకు వెళ్లక తప్పదు.. నా కాళ్ల దగ్గరకు రాక తప్పదని అంటుంది అనామిక. నువ్వు కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ అనుకున్నా.. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు అని తెలిసింది. కరెక్ట్ నీకు అర్థమైంది కదా.. వెళ్లి వాళ్లందరికీ చెప్పు.. జైలుకు వెళ్లకుండా నాకు నచ్చి ఉండమను. వెళ్లు రేపు కోర్టులో కలుద్దామని అనామిక వెళ్లి పోతుంది.

అప్పూని టార్గెట్ చేసిన మీడియా..

కట్ చేస్తే.. తెల్లవారుతుంది. అందరూ కోర్టుకు వెళ్తారు. అక్కడ మహిళా సంఘాలు కళ్యాణ్ డాం డాం.. కళ్యాణ్‌కు శిక్ష పడాలని అంటారు. మీడియా మొత్తం కవరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కనకం వాళ్లు వస్తారు. అప్పూని చూసిన మీడియా వాళ్లు అక్కడకి వెళ్తారు. కళ్యాణ్‌కి, మీకు ఎన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం నడుస్తుంది? అనామికకు మీకు గొడవలు ఉన్నాయా? అని రక రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. దీంతో కనకం కోపంగా స్పందిస్తుంది. చాలు ఆపండి.. ఆడ పిల్లలు అయి ఉండి మరో ఆడపిల్లను అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది. నా కూతురు కూడా ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే ఇక్కడికి వచ్చామని వెళ్తారు కనకం వాళ్లు. ఇక అందరూ లోపలికి వెళ్తారు.

నీకు నువ్వే సర్వ నాశనం చేసుకుంటున్నావు..

కళ్యాణ్ దగ్గరు వచ్చి అనామిక కావాలనే రెచ్చ గొడుతుంది. ఎలా ఉండే నిన్ను ఎక్కడి దాకా తెచ్చానో చూశావు కదా అని అంటుంది. నీ బతుకు ఎవరో కాదు అనామిక నీకు నువ్వే సర్వ నాశనం చేసుకుంటున్నావు. నాదేముంది.. నువ్వు గడప దాటిన నుంచి ప్రశాంతంగా పడుకుంటున్నా అని అంటాడు. ఇవాళ నిన్నూ నీ ప్రియురాలిని అందరూ చీదరించుకునేలా చేయకపోతే నా పేరు అనామికనే కాదని అంటుంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్.. వెళ్లమని చెప్తాడు. అప్పుడే జడ్జి వస్తాడు.

ఇద్దరూ కలిసి పోతారా..

తగాదాలు లేని భార్యాభర్తలు ఉండరు. అభిప్రాయభేదాలు ఉండని వాళ్లు కూడా ఉండరు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు. అనే విషయం పక్కన పెడితే.. కోర్టు దాక రాక ముందే పరిష్కారం చేసుకోవాలి. నేను అందరి గురించి మాట్లాడటం లేదు. ఈ కేసు గురించి మాత్రమే చెప్తున్నా. అబ్బాయి ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాడు. కాబట్టి విడాకుల దాకా వెళ్లకుండా ఉండాలని ఆశిస్తున్నా. ఇప్పటిదాకా మించిపోయింది లేదు.. అప్పూ అనే మూడో వ్యక్తి వలన గొడవలు వస్తున్నాయి అంటున్నారు. ఆ అమ్మాయిని కోర్టులో నిలబెట్టి పరువు తీయాలని కాదు. కాబట్టి నేను మీ ఇద్దర్నీ అడుగుతున్నా. ఇద్దరూ కలిసి ఉండటానికి ఒప్పుకుంటారా? అని ముందు అనామికను అడుగుతాడు జడ్జి.

నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి.. జడ్జి షాక్..

కావాలి సర్.. కానీ ఇంత సింపుల్‌గా అయితే కాదు. ఆ అప్పూని బోనులో నిలబెట్టాలి. వీళ్ల ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయట పెట్టాలి. నా కాపురంలో ఇన్ని గొడవలకు కారణం అయిన అప్పూకి శిక్ష పడాలి. కళ్యాణ్ నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని అనామిక అంటుంది. కాళ్లు పట్టుకోవాలా.. పట్టుకోకపోతే అని జడ్జి అడుగుతాడు. కఠినంగా శిక్షించాలి. జైలుకు పంపించాలని అనామిక డిమాండ్ చేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Vishwak Sen: ఇదెక్కడి క్రేజీ న్యూస్ రా మావా..! అనుదీప్ డైరెక్షన్‌లో మాస్ కా దాస్

0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హిట్లు , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. వచ్చిన ఆఫర్స్ ను వదలకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫలక్ నామా దాస్ లాంటి మాస్ సినిమా, అర్జున కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమా, లేదా దాస్ కా ధమ్కీ లాంటి యాక్షన్ సినిమా అయినా సరే తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మాస్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే ఇప్పుడు విశ్వక్ వరుసగా సినిమాలను లైనప్ చేసి బిజీగా మారిపోయాడు. ఇప్పటికే విశ్వక్ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

రీసెంట్ గా లైలా అనే సినిమా చేశాడు విశ్వక్. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ చేశాడు విశ్వక్. జాతిరత్నాలు సినిమాతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు అనుదీప్ తో విశ్వక్ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతోంది అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుదీప్ శివకార్తికేయన్ తో సినిమా చేశాడు. ప్రిన్స్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు అనుదీప్. రీసెంట్ గా కల్కి సినిమాలో అలా కనిపించి ఇలా మాయమయ్యాడు అనుదీప్. ఇప్పుడు విశ్వక్, అనుదీప్ కాంబోలో సినిమా వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ కలిస్తే రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Agent: ఏజెంట్ వచ్చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ సినిమా ..

0

సినిమా ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ వస్తున్నాయ్.. చిన్న సినిమాల నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు చాలా మంది హిట్స్ సాధిస్తూ రాణిస్తున్నారు. అయితే అక్కినేని యంగ్ హీరో అఖిల్ మాత్రం చాలా కాలంగా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కూడా సక్సెస్ అందుకోలేకపోయాడు. అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు . వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోతున్నాడు. ఇక చివరిగా అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అయితే నెలలు గడుస్తున్నా ఏజెంట్ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదుచూస్తున్నారు.

సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వస్తాయి.. కొన్ని సినిమాలు వారం రోజులకే వస్తాయి.. అని ఏజెంట్ సినిమా మాత్రం ఇంతవరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు. దానికి కారణం తెలియదు కానీ.. అసలు ఈ సినిమా ఎలా ఉంది .? ఎందుకు అంతలా డిజాస్టర్ అయ్యింది.? అని చూద్దామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.

ఏప్రిల్ 28న విడుదలైన ఏజెంట్ సినిమా ఇంతవరకు ఓటీటీ బాట పట్టలేదు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యిన తర్వాత అఖిల్ చాలా కాలం అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జులై రెండో వారం లేదా చివరిలో ఈసినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Kumari Aunty: కుమారీ ఆంటీని కలిసిన సోనూ సూద్.. ఎలాంటి సాయమైనా చేస్తానంటూ హామీ

0

Kumari Aunty: కుమారీ ఆంటీని కలిసిన సోనూ సూద్.. ఎలాంటి సాయమైనా చేస్తానంటూ హామీ

ఇనార్బిట్ ITC కోహినూర్ హోటల్ దగ్గరున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల దగ్గర సడన్ గా ఒక ఆడి కారు ఆగింది. అందులోంచి దిగిన నటుడు సోనూసూద్.. ఆయన రోడ్డు పక్కడ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీని కలిసి సడన్ సర్ప్రైజ్‌ ఇచ్చారు. నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని కలిశారు.ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు.

మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని.. భవిష్యత్‌లో ఎలాంటి సహాయం అవసరమైనా.. చేస్తానని సోనూ సూద్ కుమారి ఆంటీకి చెప్పారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం స్ట్రీట్ ఫుడ్ అమ్మడం ప్రారంభించిన కుమారి ఆంటీ నేడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఓ సెలబ్రిటీ అయ్యారు. మొన్నటివరకు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించింది. తాజాగా సోనూ సూద్ కుమారి ఆంటీని కలవడంతో ఆమె క్రేజ్ డబుల్ అయ్యింది.

 

Lakshmi Manchu: దయచేసి నాకు సాయం చేయండి.. కూతురి కోసం మంచు లక్ష్మీ పోస్ట్

0

Lakshmi Manchu: దయచేసి నాకు సాయం చేయండి.. కూతురి కోసం మంచు లక్ష్మీ పోస్ట్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు, ఓ నటి ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కాగా మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, యాంకర్ గా తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది మంచు లక్ష్మీ. అలాగే నిర్మాతగాను మంచి సినిమాలను అందించారు మంచు లక్ష్మీ. అలాగే పలు టాక్ షోలకు హోస్ట్ గాను వ్యవహరించారు మంచు లక్ష్మీ ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మీ. అలాగే సమాజంలో జరిగే పలు సంఘటనల పై స్పందిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కూతురి గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది మంచు లక్ష్మీ. తన కూతురి కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలనీ కోరింది మంచు లక్ష్మీ. నా అమెరికా వీసా ఒక నెల క్రితమే అప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు అది నాకు రాలేదు. నా కూతురు స్కూల్ కి ఇచ్చిన సెలవలు అయిపోయాయి. నేను జూన్ 12న అమెరికాకు వెళ్ళాలి. కానీ నాకు వీసా ఇంకా రాలేదు. ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతో.. నేను వాళ్ళను కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి నాకు సహాయం చేయండి “అంటూ రాసుకొచ్చింది.

మంచు లక్ష్మీ షేర్ చేసిన పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మంచు లక్ష్మీ వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్ళికి హాజరయ్యింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది లక్ష్మీ. కాగా మంచు లక్ష్మీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే యక్షిణి అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.  అలాగే ఆదిపర్వం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Suriya’s Kanguva Nizam release by Mythri Movie Distributors, Grand Theatrical Release on October 10th

0

Star hero Suriya’s prestigious movie ‘Kanguva’ is set for a grand worldwide theatrical release on October 10, coinciding with the Dussehra festival. This eagerly anticipated film is being distributed in the Nizam area by Mythri Movie Distributors, a renowned distribution company known for bringing numerous super hit films to audiences.

The association of Mythri Movie Distributors with ‘Kanguva’ has only increased the excitement surrounding the film. Directed by Siva, ‘Kanguva’ is a massive period action film featuring pivotal roles played by Disha Patani and Bobby Deol. Produced by KE Gnanavel Raja, Vamsi, and Pramod under the banners of Studio Green and UV Creations, the film has been made with huge budget.

The sizzle teaser and posters released so far have piqued curiosity and heightened anticipation for the movie. ‘Kanguva’ promises to captivate audiences with a novel concept within the period action genre. The film is being released in ten languages, will also be available in 2D and 3D and is set to debut in many international languages. As one of the biggest films emerging from the Indian film industry, ‘Kanguva’ is generating immense expectations among trade circles and audiences alike.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో దిశా పటని రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..?

0

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన కల్కి సినిమా రికార్డుల మోతమోగిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఊహించని విధంగా కలెక్షన్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా ఇప్పటికే ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమాలో చాలా మంది సూపర్ స్థార్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో అందాల భామలు దీపికా పదుకొనె , దిశా పటాని హీరోయిన్స్ గా చేశారు. ఇదిలా ఉంటే కల్కి సినిమాలో దిశా పటాని పాత్ర కోసం ముందుకు మరో హీరోయిన్ ను అనుకున్నారని టాక్ వినిపిస్తుంది..

సినిమాలో ఎలాగో ఒక హీరోయిన్ బాలీవుడ్ నుంచి ఉంది కాబట్టి రెండో హీరోయిన్ ను టాలీవుడ్ నుంచి తీసుకోవాలనుకున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దిశా ప్లేస్ లో ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో .. ఫిలిం సర్కిల్స్ లో ఇదే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ రష్మికాను సంప్రదించినప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే రష్మిక చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లో ఓ సినిమా బాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు చేస్తుంది. అయితే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకునేంత అమాయకురాలు కాదు రష్మిక. కల్కి సినిమాలో ఆమె ఛాన్స్ మిస్ చేసుకుందని వస్తున్న వార్త పూర్తిగా రూమర్స్ మమాత్రమే అని తెలుస్తోంది. గతంలోనూ రష్మిక సీతారామం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. పైగా దిశా పటాని సినిమాలో కనిపించేది తక్కువ సేపే కాబట్టి పెద్దగా డేట్స్ కూడా అవసరం ఉండవు.. దాంతో ఇవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది. ఇక కల్కి విషయానికొస్తే ఈ సినిమాలో చాలా మంది నటించారు. దుల్కర్ సల్మాన్, శోభన, మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, అవసరాల శ్రీనివాస్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలా మంది కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Niharika Nm: బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..

0

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వాడకం ఎక్కువైన దగ్గర నుంచి ఎవరు ఎందుకు ఫెమస్ అవుతున్నారో అర్ధం కావడంలేదు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ కొంతమంది పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది బూతులు మాట్లాడుతూ.. బోల్డ్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు. మరికొందరు ఏకంగా సినిమాల్లోనే కనిపించారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారు. దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, అషు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మందే ఉన్నారు.

తాజాగా మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ కూడా ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతుంది. ఆమె పేరు నిహారిక.. ఈమె గురించి చాలా మందికి తెలుసు. సినిమా వాళ్ళతో రకరకాల వీడియోలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది సెలబ్రిటీలతో ఆమె వీడియోలు చేసింది. పైగా నిహారిక వీడియోలు చేసిన స్టార్స్ మామూలు వాళ్ళు కాదు.. మహేష్ బాబు, రాకింగ్ స్టార్ యష్ , రణబీర్ కపూర్ ఇలా పెద్ద పెద్ద హీరోలతో మూవీ ప్రమోషన్స్ చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. నిహారిక హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈమేరకు గీత ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కానీ సినిమా వివరాలు ఏమీ వెల్లడించలేదు. త్వరలోనే దీని పై అప్డేట్స్ రానున్నాయి. కాగా నిహారిక చాలా ఫెమస్.. సినిమా స్టార్స్ సైతం ఆమెను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతుంటారు. సమంత, నయన తార, లక్ష్మీ మంచు, నాగ చైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ ఇలా చాలా మంది నిహారికాను ఫాలో అవుతున్నారు. అంతే కాదు ఆమె పలు యాడ్స్ లోనూ నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ అవతారమెత్తనుంది. మరి ఈ అమ్మడు హీరోయిన్ గా ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.

గీత ఆర్ట్స్ ఇన్ స్టా..

నిహారిక ఇన్ స్టా..

నిహారిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.