Home Blog Page 503

Raj Tarun: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య.. మధ్యలో హీరోయిన్.. ట్రయాంగిల్ ప్రేమకథలో ఎన్నో ట్విస్టులు..

0

రాజ్‌ తరుణ్‌ వర్సెస్‌ లావణ్య..మద్యలో మాల్వీ మల్హోత్రా. ట్రయాంగిల్‌ రిలేషన్‌ షిఫ్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్‌ తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు. కానీ ..ఇప్పుడు మాల్వీ మల్హోత్ర అనే యువతి మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రాజ్‌తరుణ్‌పై కంప్లేంట్‌ చేశారామె. అంతేకాదు మాల్వీ మల్హోత్ర ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని..తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాల్వీ మల్హోత్ర – రాజ్‌తరుణ్‌ ఇద్దరూ తిరుగబడరస్వామిలో కలిసి నటించారు.

లావణ్య తన కంప్లేంట్‌లో మాల్వీ మల్హోత్రతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు. రాజ్‌ తరుణ్‌కు తాను దూరం కావాలని వాళ్లు బెదిరిస్తున్నారని వాపోయారామె. రాజ్‌తరుణ్‌ లేకపోతే తాను ఉండలేననీ.. అతనితోనే కలసి బతకాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా లావణ్య కంప్లేంట్‌ తెరపైకి రాగానే అలా రాజ్‌ తరుణ్‌ తన వెర్షన్‌ విన్పించారు. సహజీవనం నిజమే. కానీ అది ఒన్స్‌ అపానే టైమ్‌. ఇప్పుడు తను మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉందని.. డబ్బు కోసం తనను బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తుందని ఆరోపించారు. ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.

మాల్వీ మల్హోత్రతో ఎఫైర్‌ కారణంగానే రాజ్‌తరుణ్‌ తనను పక్కనబెట్టాడనీ లావణ్య అంటోంది. తిరగబడరా సామీ మూవీ షూటింగ్‌కు ముందు నుంచే వాళ్లిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందని.. ఆమెను కలవడానికి రాజ్‌ తరుణ్‌ ముంబై వెళ్లి వచ్చేడాన అంటుంది లావణ్య. అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తకు ఫ్యామీలీ ఫ్రెండ్‌ అని తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంది లావణ్య. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య డిఫరెనెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. తమ సహజీవనం నిజమే కానీ ఇప్పుడు లావణ్య మరొకరితో రిలేషన్‌ షిప్‌లో ఉందన్నారు రాజ్‌ తరుణ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Prabhas: ప్రభాస్ దగ్గరున్న డోల్స్ & గబ్బానా సన్ గ్లాసెస్ ధర ఎంతో తెలుసా..?

0

ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో సెన్సెషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసిన డార్లింగ్ ఇప్పుడు థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో అభిమానులను నిరాశ పరిచినా డార్లింగ్.. ఇప్పుడు కల్కి మూవీతో డబుల్ ట్రీట్ ఇచ్చాడు. కల్కి 2898 ఏడి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ మరింత పెరిగింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి.. హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. త్వరలోనే ఈ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. కల్కి సినిమాలో పంజాబీ పాప్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ తో కలిసి స్టెప్పులేశాడు డార్లింగ్. ఈ పాటలో ప్రభాస్ లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది. పంజాబీ స్టైల్లో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేశాడు. అయితే ఈ పాటతోపాటు.. కల్కి ప్రమోషన్లలో ప్రభాస్ డోల్స్ & గబ్బానా సన్ గ్లాసెస్ ధరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సన్ గ్లాసెస్ ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డికోడ్ ప్రకారం ప్రభాస్ ధరించిన ఆ సన్ గ్లాసెస్ ధర రూ.35.314.

ఇదిలా ఉంటే.. విడుదలైన 8 రోజుల్లో కల్కి చిత్రం రూ. 750 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఈ ఏడాది విడుదలైన ప్రాంతీయ, హిందీ చిత్రాలను అధిగమించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ మూవీ మరిన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా సాగుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pawan Kalyan: చివరి దశకు పవన్ వారాహి దీక్ష.. ఆదిత్య ఆరాదనతో ప్రత్యేక పూజలు..

0

సనాతనం సమ్మోహనం.. వారాహి దీక్షలో భాగంగా ఏకాదశ దిన ఆదిత్య ఆరాధన చేశారు పవన్ కల్యాణ్. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సూర్యభగవాణ్ణున్ని పూజించారు. సమాజహితం, దేశ సౌభాగ్యం కాంక్షిస్తూ లాస్ట్ ఇయర్ నుంచి వారాహి దీక్ష చేస్తున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈఏడాది కూడా వారాహి దీక్షను 11రోజులపాటు చేస్తున్నారు. జనసేన పార్టీ అఖండ విజయం.. కూటమి గెలుపు .. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత నెల 26న వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు పవన్. వారాహి దీక్ష ఈనెల 6వ తేదీతో ముగుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ఆదిత్య ఆరాధన పూజ నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరాధనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన సూర్యారాధనలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కి తిలకం దిద్దిన వేదపండితులు.. స్వామి వారి తీర్ధం ఇచ్చి దీక్ష ప్రారంభించారు.

దీని కోసం ముందేగా వేదపండితులు ఆదిత్య యంత్రం ఏర్పాటు చేశారు. దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత.. ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సూర్యభగవాణ్ణున్ని పూజించారు. కొన్ని గంటల పాటు ఆదిత్య ఆరాధన చేశారు పవన్ కల్యాణ్. ఆదిత్య ఆరాధన అనంతరం యాగశాలలపవన్ కళ్యాణ్ గతంలో రోజూ సూర్య నమస్కారాలు చేసే వారు.. అయితే గత కొంతకాలంగా వెన్నునొప్పి ఇబ్బందుల కారణంగా సూర్య నమస్కారాలకు విరామం ఇచ్చారు.

సూర్య నమస్కారాలకు బదులుగా మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహి దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వహించారు పవన్ కల్యాణ్. వేద పండితులు సూర్యుని విశిష్ఠతను తెలియజేశారు. ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు. వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ దీక్షలో భాగంగా కేవలం పళ్ళు, ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారు.

Anjali: వేశ్య పాత్రలో అంజలి.. బహిష్కరణ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. కథానాయికగా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. వైవిధ్యమైన పాత్రలలో తన నటనతో మెప్పించిన అంజలి… ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. ఎలాంటి పాత్రలలోనైనా జీవించేస్తుంది. వకీల్ సాబ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో అలరించిన అంజలి.. ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో కనిపించింది. ఈ మూవీ వేశ్య పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో అంజలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వేశ్వ పాత్రలో అలరించేందుకు రెడీ అయ్యింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అంజలి.. ఇప్పుడు మరోసారి వేశ్య పాత్రలో అడియన్స్ ముందుకు రాబోతుంది. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విభిన్నమైన విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పిక్సెస్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది అంజలి.

ఈ సినిమాలో పుష్ప పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందని.. అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుందని అన్నారు. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ వెబ్ సిరీస్ లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tollywood: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తోన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్న హీరోయిన్.. ఏడాదికే విడాకులు..

0

Tollywood: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తోన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్న హీరోయిన్.. ఏడాదికే విడాకులు..

ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఒకవైపు ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. విడిపోయాం.. విడాకులు తీసుకున్నామంటూ మరో జంట ప్రకటిస్తుంది. పెళ్లైన హీరోలతో హీరోయిన్ ప్రేమాయణం, అరరె లవ్ బర్డ్స్ బ్రేకప్.. ఇలా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు. తమ మాజీ పార్టర్న్స్ మరో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే.. అసలు నో మ్యారేజ్ అంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. నిజానికి బుల్లితెరపై ఆమె ఫైర్ బ్రాండ్. యూత్ లో యమ ఫాలోయింగ్ ఉంటుంది. పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్.. నటనలోనే కాదూ.. చూపులతోనే భయపెట్టించే నటి. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. రంగుల ప్రపంచంలో స్టార్ నటిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే పర్సనల్ లైఫ్ లో షాక్ తగిలింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మరో అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి.. అతడిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. సీరియల్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నడూ చలించలేదు. విడాకుల తర్వాత ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. తనే జెన్నిఫర్ వింగెట్. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు.. కానీ మాయ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా మాయ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ పాత్రలో జెన్నిఫర్ స్టైల్, యాక్టింగ్, యాటిట్యూడ్, మేనరిజం చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. బేహద్ సీరియల్లో ఆమె చేసిన పాత్రను జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు.

హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. నటిగా చాలా ఫేమస్ అయిన జెన్నిఫర్ మాత్రం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి సీరియల్ షూటింగ్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జెన్నిఫర్ ను భర్త మోసం చేశాడని.. అతడికి మరో నటితో రిలేషన్ లో ఉన్నాడని తెలిసింది. తన భర్త ప్రియురాలితో సరదాగా మాట్లాడుతుండగా.. అతడిని అందరి ముందు సెట్ లో కొట్టిందట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కరణ్ సింగ్ తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యిందట. దీంతో 10 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకుంది. 2014లో భర్తతో విడిపోయిన జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Vishwak Sen: ‘ఇది చిన్న బ్రేక్ మాత్ర‌మే.. ఎవరూ చింతించొద్దు’.. హీరో విశ్వక్ సేన్ సంచలన నిర్ణయం

0

ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ రెండు సినిమాల్లోనూ విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం లైలా అనే మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా లైలా సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇందులో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్నారు విశ్వక్ సేన్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా సోషల్ మీడియా నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు విశ్వక్ సేన్. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడీ ట్యాలెంటెడ్ హీరో. ‘అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ‍అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌కు చిన్న బ్రేక్ మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. నా ట్విట్టర్‌ ఖాతాను నా టీమ్ నిర్వహిస్తుంది. నా ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేషన్‌ గురించి ఒత్తిడికి గురికావద్దు’ అని రాసుకొచ్చాడు విశ్వక్ సేన్.

కాగా గత కొన్ని రోజుల నుంచి విశ్వక్ సేన్ ఇన్ స్టా గ్రామ్ లో ఎలాంటి పోస్టులు లేవు. దీంతో అభిమానులు, నెటిజన్లు విశ్వక్ సేన్ కు ఏమైంది? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాజాగా దీనిపై కూడా స్పందించాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని ప్రశ్నలు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాలు నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించలేవు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హీరో విశ్వక్ సేన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Prabhas – Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ హవా.. కల్కి జోరు మరింత పెరుగుతుందా.?

0

ఈ సారి గ్రాఫిక్స్ వర్క్ మరింత భారీగా ఉండబోతుందని, అందుకే పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కవు టైమ్ పడుతుందని చెప్పారు.

Director Nag Ashwin: కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. అసలు విషయం చెప్పేసిన నాగ్ అశ్విన్..

0

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది. భారీ అంజనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి రెండో వారంలోనూ మరిన్ని వసూళ్లు రావడం ఖాయమని.. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‏లో చేరనుందని అంటున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఇప్పటికే చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈసినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించగా.. కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ మూవీ తర్వాత అర్జునుడు, కర్ణుడి గురించి చర్చలు జరిగాయి. అలా చర్చ జరగడం మంచిదే అని.. మహా భారతం గురించి అందరూ తెలుసుకుంటారు. అది మంచిదేగా అని అన్నారు. అలాగే నాని, నవీన్ పొలిశెట్టి లను కూడా రెండు పార్టులో ఎక్కడ వీలైతే అక్కడ ఇరికించేస్తా అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే కల్కి సినిమాలో భైరవ పాత్రను సీరియస్ గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతో అలా క్రియేట్ చేశానని అన్నారు.

ఇక శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు నటిస్తే బాగుంటుందనే చర్చలు సోషల్ మీడియాలో జరిగాయి. నిజంగానే తీసుకుంటారా ? అని అడగ్గా.. కృష్ణుడిగా మహేష్ బాబు బాగుంటాడు. కానీ ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలో చేస్తే బాగుంటుంది అని అన్నారు. అలాగే కల్కి 2లో కమల్ హాసన్ పాత్రను పూర్తిగా చూపిస్తామని అన్నారు. బుజ్జిని డిజైన్ చేసేందుకు టీం చాలా కష్టపడిందని.. బుజ్జి కోసం సపరేట్ లైసెన్స్ కూడా ఇచ్చారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ranveer Singh: బాలీవుడ్‌ని దున్నేస్తాడని కబుర్లు చెప్పి.. ఇప్పుటికి అవకాశాలకోసం చూపులు.

0

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందా? నెటిజన్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన డైరెక్టర్ హరీశ్‌ శంకర్

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రూమర్లు వస్తున్నాయి. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ మాత్రం వీటికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నాడు. తన సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా ఒక నెటిజన్ ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ ఆగిపోనుందంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘సినిమా మొదలేకాదు అని రూమర్స్‌ వచ్చినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడీ స్టార్ డైరెక్టర్.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, గిరి, గౌతమి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హరీశ్ శంకర్ ట్వీట్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్..

డైరెక్టర్ హరీశ్ శంకర్ ,పవన్ కల్యాణ్ లతో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.