Home Blog Page 495

ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా

0

ఓటీటీలో వందల కొద్దీ సినిమాలు అందుబాటులో ఉంటాయి.  థియేటర్స్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఇక థ్రిల్లర్, హారర్ మూవీస్ చూడటానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రొమాంటిక్ మూవీస్ కు కూడా ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఓటీటీలో చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా చూసిన వారంతా ఇదెక్కడి సినిమారా మావా అంటున్నారు. ఆ రేంజ్ లో ఉంది ఆ సినిమా.. అబ్బాయి- అమ్మాయి మధ్య పుట్టడం చాలా కామన్. కానీ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనేది కాస్త వెరైటీ అనే చెప్పాలి.

ఇక్కడ చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మ కూడా అప్సరరాణిని పెట్టి ఇలాంటి సినిమానే చేశాడు. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోన్న రొమాంటిక్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఓ అమ్మాయి నైట్ క్లబ్ లో సింగర్ గా చేస్తుంది. మరో అమ్మాయి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటుంది. ఈ ఇద్దరూ అనుకోకుండా కలుసుకుంటారు.. తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడతారు. ఆతర్వాత మాటలు కలుస్తాయి.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

అనుకోకుండా ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దాంతో ఇద్దరూ లివిన్ రిలేషన్ లోకి వెళ్తారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకరినొకరు వదిలి ఉండలేనంతగా ప్రేమ పెరిగిపోతుంది. ఆతర్వాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. గొడవలు మొదలవుతాయి. సింగర్ అమ్మాయి.. ఆ క్రియేటివ్ ఫీల్డ్ అమ్మాయిని కొడుతుంది కూడా.. అలాగే దూరం పెడుతుంది. నన్ను తాకకు అనేంతగా గొడవపడుతారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది.? ఎందుకు ఈ ఇద్దరు గొడవ పడ్డారు.? ఆతర్వాత కలిశారా.? అసలు ఏమైంది అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడలేం.. ఒంటరిగా ఈ సినిమా చూడటం బెటర్.. ఈ సినిమా పేరు డక్ బటర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

0

రాజ్ తరుణ్, లావణ్య యవ్వారం రోజుకొక్క మలుపుతిరుగుతుంది. తనను మోసం చేశాడు అంటూ  లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు అంటుంది లావణ్య అనే యువతి. తనను ప్రేమించి ఇప్పుడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆరోపిస్తుంది లావణ్య. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తిరగబడరా సామి అనే సినిమా చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తనపై లావణ్య చేసిన ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండించాడు.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

లావణ్య అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని.. కాకపోతే ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, అలాగే వేరే అబ్బాయితో ఆమె రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ అన్నారు. మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నానంటూ ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదు అంటున్నారు ఈ హీరోగారు. కానీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెడుతోంది. తాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా మాట నిజమే కానీ తాను డ్రగ్స్ వాడలేదు అని అంటుంది లావణ్య.

ఇది కూడా చదవండి :స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు.. ప్రభాస్ దర్శకుడి కామెంట్స్

తాజాగా రాజ్ తరుణ్ కు బిగ్ బాస్ ఫెమ్ అరియానా గ్లోరీ కి కూడా ఎఫైర్ ఉందని ;అంటుంది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య. మాల్వి మల్హోత్రతోనే కాదు మరికొంతమందితోనూ రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని తెలిపింది లావణ్య. ఈ క్రమంలోనే అరియానాతోనూ అతను ఎఫైర్ పెట్టుకున్నాడని.. అరియానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్లాడు రాజ్ తరుణ్. నేను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లాను ఆ టైం లో రాజ్ తరుణ్ అరియానాకు దగ్గరయ్యాడు. నేను వెళ్లిన నెలరోజులకు రాజ్ తరుణ్, అరియానా కలవడం మొదలు పెట్టారు. ఈ విషయం నాకు రాజ్ తరుణ్ మేనేజర్, నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి చెప్పారు.. లేకపోతే ఈ ఇద్దరి యవ్వారం నాకు తెలిసేది కాదు అని తెలిపింది లావణ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

0

Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

బుల్లితెర నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రముఖ బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా సినిమాల్లో చేస్తున్నారు. మరికొంతమంది హీరోలుగా మారారు.. వీరితో పాటు వేణు, ధనరాజ్ లాంటి వారు దర్శకులుగా తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో చేసిన లేడీ కంటెంట్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఫైమా ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. టీవీ షోలో నవ్వులు పూయించిన ఫైమా అదే క్రేజ్ తో తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన శైలిలో ఆట ఆడిప్రేక్షకులను అలరించింది. టాస్కులు చాలా బాగా ఆడి ఆడియన్స్ ను అలరించింది.

అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించి నవ్వులు పూయించింది. ఇదిలా ఉంటే ఫైమా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ఈ చిన్నది పటాస్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి కొన్ని వీడియోలు చేయడం , షాపింగ్ చేయడంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవలే తన పుట్టిన రోజున ప్రవీణ్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను అని చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేసింది ఫైమా..

తాజాగా ఫైమా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అక్కా.? అని అడగ్గా.. తొందరలో అని తెలిపింది. అలాగే తనచేసుకోబోయేవాడి ఇంటి పేరు బాదావత్ అని హింట్ ఇచ్చింది ఫైమా. అలాగే తన పెళ్లి గురించి ఇంకా ఏదైనా అడగాలనుకుంటే వ్లాగ్‌లో క్లారిటీ ఇస్తాను చెప్పుకొచ్చింది. వీటితో పాటు ఓ కొత్త యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది ఫైమా..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

జబర్దస్త్ ఫైమా ఇన్ స్టా..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు.. ప్రభాస్ దర్శకుడి కామెంట్స్

0

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతి. ఈరోజుల్లో అనే సినిమాతో మారుతి పేరు మరురోగింది. యూత్‌ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ రోజుల్లో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు థియేటర్స్ వందరోజులు ఆడింది ఈ సినిమా. ఆతర్వాత బస్ స్టాప్, ప్రేమకథ చిత్రం సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. దాంతో మారుతి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మారుతి. ఈ సినిమాతో నాని క్రేజ్ కూడా మరింత పెరిగింది. ఆ తర్వాత వరుసగా బాబు బంగారం, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు, ప్రతిరోజూ పండగే, మంచి రోజులు వ‌చ్చాయి, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలను తెరకెక్కిచాడు.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు మారుతి ఓ స్టార్ హీరోయిన్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోయిన్ తో మారుతి గొడవపడ్డారు. ఇదే విషయం పై మారుతి ఓ ఇంటర్వ్యూలోనూ మాట్లాడారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. అవును.. నయన్ మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేసింది. ఈసినిమాలో వెంకటేష్ హీరోగా చేశారు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతార, మారుతికి మధ్య వాగ్వాదం జరిగిందట.

మారుతి మాట్లాడుతూ.. బాబు బంగారం షూటింగ్ లో నయనతార చిత్రయూనిట్ కు సహకరించేది కాదు.. నేను అప్పటికి పెద్ద దర్శకుడు కాకపోవచ్చు.. నన్ను గౌరవించకపోయినా పర్లేదు. కానీ వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలను కూడా ఆమె లెక్క చేసేది కాదు. నేను ఎంతో ఓపికగా భరించా కానీ ఒకేసారి ఆమెతో వాగ్వాదానికి దిగాను. దాంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది.. దాని కోసం రమ్మంటే .. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. డేట్స్ ఖాళీ లేవు అని చెప్పింది.. దాంతో ఓ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం అని మారుతి తెలిపారు. ఇక ప్రస్తుతం మారుతి ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. ది రాజా సాబ్ అనే టైటిల్ తో మారుతి సినిమా చేస్తున్నారు. ఈ సినిమానుంచి ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మారుతి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Trending: ఏంటి.. ఈ అప్సరస అమితాబ్ మనవరాలా..? ఇన్నాళ్లూ ఎక్కడున్నారు మేడమ్

0

అమితాబ్ బచ్చన్.. సిల్వర్ స్క్రీన్‌పై తిరుగులేని సూపర్ స్టార్. ఆయన ఏ పాత్ర చేసినా 1000 శాతం న్యాయం చేస్తారు. హీరోగా దశబ్ధాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆయన.. ఇప్పుడు సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. 81 ఏళ్ల వయస్సులో కల్కీ సినిమాలో ఆయన చేసిన అశ్వత్థామ క్యారెక్టర్ నభూతో నభవిష్యతి!. ఆయన్ను ఆ రోల్‌లో అలా చూస్తుంటే అశ్వత్థామ నిజంగా వచ్చారేమో అనిపించింది. కాగా అమితాబ్ లెగసీని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ముందుకు తీసుకువెళ్తున్నాడు. అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా ఇండస్ట్రీపై తన మార్క్ వేస్తున్నారు.

అయితే బిగ్ బీ కుమార్తె.. మనవరాలు(కూతురు కుమార్తె) మాత్రం వ్యాపార రంగంలో తమ మార్క్చూపిస్తున్నారు. అమితాబ్ కూతురు… శ్వేత బచ్చన్ నందా కుమార్తె… నవ్య నవేలి నందా బిజినెస్‌లో అద్భుతమైన గ్రోత్‌తో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. 26 ఏళ్ల ఏజ్‌లోనే.. స్మార్ట్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్ స్థాపించి.. చాలామంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. విమెన్ ఎంపౌర్‌మింట్ దిశగా వాళ్లను ప్రొత్యహించేందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకునేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ సంగీత్ ఈవెంట్‌లో నవ్య మెరిసింది. ఈ వేడకలో రెడ్ కలర్.. ఔట్‌ఫిట్‌లో.. ఆమెను చూస్తే ఇంద్రలోకం నుంచి దిగి వచ్చినట్లే అనిపించింది. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు హీరోయిన్ల కంటే అందంగా ఉందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఎప్పటికైనా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా.. అసలు నటనపై ఇంట్రస్ట్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Navya Naveli

Navya Naveli

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జెనీలియా, రితీష్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.. ఎందరికో స్ఫూర్తి అంటూ..

0

జెనీలియా డిసౌజా..ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరేట్ హీరోయిన్. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బాయ్స్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్ లో ఉంటుంది. ఆలాగే సై, ఢీ, హ్యాపీ, ఆరెంజ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు. ఇటీవలే వేద్ అనే ఓ మరాఠీ సినిమాలో నటించింది జెనీలియా.తాజాగా ఈ సెలబ్రిటీ జంట చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్ అవయవ దానం చేశారు. ఇందుకు గాను ఆ దంపతులకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. రితేష్ ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవయవ దానం ఎంతో గొప్ప దానం. దీని వల్ల వ్యక్తి మరణించిన తర్వాత కళ్ళు మరికొన్ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. రితేష్, జెనీలియా తీసుకున్న ఈ నిర్ణయం పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతకుముందు రితేష్ మాట్లాడుతూ.. ”నేనూ, జెనీలియా మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశాం’’ అని రితేష్ తెలిపారు. ఈ విషయాన్ని జెనీలియా కూడా తెలిపింది. ఈ వీడియోను నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ షేర్ చేసింది. రితేష్‌, జెనీలియాకు ధన్యవాదాలు. ఈ ఇద్దరూ తమ అవయవాలు దానం చేస్తానని ప్రమాణం చేశారు. వీరి నిర్ణయం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలి’ అని రాసుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనాక్షి సిన్హా, షకీబ్ సలీమ్‌లతో కలిసి రితేష్ ‘కాకుడ’ సినిమాలో నటిస్తున్నాడు. ఆదిత్య సర్పోథర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 12న సినిమా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Anjali: బోల్డ్ కారెక్టర్స్ వైపు అడుగులేస్తున్న అంజలి.. సీత టూ వేశ్య వరకు ఎందుకు చేంజ్.!

0

AAY third single “Amma Lalo Ram Bhajana” is out now

0

GA 2 Pictures next  AAY movie stars young and energetic hero Narne Nithiin and gorgeous Nayan Sarika in lead roles. The film directed by debutant filmmaker Anji K Maniputhra. Talented producers Bunny Vas and Vidya Koppineedi are bankrolling this entertainer.

AAY single titled “Amma Lalo Ram Bhajana” is out now. Makers called it as Srinivasuni Song as it explains Srinivasa Kalyanam story in a beautiful way using our old tradition Burra Katha. It intricately weaves together the narrative of Lord Srinivas Kalyanam. The song stands as a poignant tribute to our rich tradition and culture, vividly portrayed throughout its Lyrical video.

Penned by director AnjiK Maniputhra, the lyrics form a rich tapestry, capturing the essence of this age-old tale. Penchal Das’s mesmerizing vocals and Ajay Arasada’s captivating composition imbue the Burra Katha story with a magical allure. This powerful composition is poised to resonate deeply. “AAY” will be hitting theatres worldwide on Independence Day, August 15th.

Samantha: మరోసారి హాట్ టాపిక్ గా సమంత.! ఆ ప్రయత్నమే కొంపముంచిందా.?

0

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్.

0

ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నాయి. తమ మాజీ పార్టర్న్స్ మరో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే.. అసలు నో మ్యారేజ్ అంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో బీటౌన్ బుల్లితెర హీరోయిన్ జెన్నిఫర్ ఒకరు. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈమె…నిజ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. రంగుల ప్రపంచంలో స్టార్ నటిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈమెకు పర్సనల్ లైఫ్ లో షాక్ తగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మరో అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి.. అతడిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్ గా తన లైఫ్‌ లీడ్ చేస్తోంది. తన తీరుతో ఇప్పుడు బీటౌన్ టెలివిజన్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.

సీరియల్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన జెన్నిఫర్ వింగెట్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నడూ చలించలేదు. విడాకుల తర్వాత ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. నటిగా చాలా ఫేమస్ అయిన జెన్నిఫర్ మాత్రం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ సీరియల్ షూటింగ్ ద్వారా పరిచయమయ్యారు.

ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే.. తన భర్త మోసం చేశాడని.. అతడు మరో నటితో రిలేషన్ లో ఉన్నాడని జెన్నిఫర్ అంటోంది. తన భర్త ప్రియురాలితో సరదాగా మాట్లాడుతుండగా.. అతడిని అందరి ముందు సెట్ లో కొట్టిందట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కరణ్ సింగ్ తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యిందట. దీంతో 10 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకుంది. 2014లో భర్తతో విడిపోయిన జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతోంది. తన తీరుతో.. ఇప్పటికీ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.