Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorized'శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..'

‘శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..’

అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. జులై 12న రాధిక మర్చంట్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు అనంత్ అంబానీ. ఇక త్వరలో అనంత్ అంబానీ- రాధిక దంపతులు లండన్ కు హనీమూన్ కు వెళ్లనున్నారని, అక్కడే పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రపంచ మంతా అనంత్ అంబానీల పెళ్లి వేడుక గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటుడు మాత్రం తన అక్కసు వెళ్లగక్కాడు. సోషల్ మీడియాలో అనంత్, రాధికల పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ సెటైర్లు వేశాడు. వీటిని చూసిన నెటిజన్లు ఆ పాకిస్తాన్ నటుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటుడు అర్సలన్ నజీర్ అనంత్ అంబానీ, రాధిక ల వివాహం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సంచలన పోస్ట్ షేర్ చేశాడు. ‘ఈరోజుల్లో వివాహ వేడుకలు ఎంతో ఆడంబరంగా చేసుకుంటున్నప్పటికీ…. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడడం లేదు’ అంటూ అనంత్, రాధికల ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ సోల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారులకు.. గోల్డెన్ ఛాన్స్.. ప్రభాస్ టీం బంపర్ ఆఫర్

ఏపీ విద్యార్థినికి సోనూ సాయం.. చేతులెత్తి మొక్కుతున్న జనం

కథ లేకున్నా తమన్నా కావాలి !! రజినీ ఫ్యాన్స్‌ సీరియస్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments