Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedచిరంజీవి, బాలయ్య మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ గురూ..!

చిరంజీవి, బాలయ్య మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ గురూ..!

సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో సినీ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వైరల్ అవుతుంటే ఉన్నాయి. ఈ ఫోటోలు చూస్తూ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇలా రేర్ ఫోటోలు నెట్టింట చాలానే ఉన్నాయి. అలాగే పైన కనిపిస్తున్న ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్యలో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్ గా వెయ్యికోట్ల కొల్లగొట్టి భారీ హిట్ అందుకుంది.

టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు లెజెండ్రీ హీరోలు.. ఈ ఇద్దరూ తమ సినిమాలతో ప్రేక్షకులను విపరీతముగా ఆకట్టుకున్నారు. ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరితో ఉన్న ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇంతకూ ఆ ఇద్దరి మధ్య ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె కూడా టాలీవుడ్ లో సెలబ్రిటీ కూతురు. ఆమె ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక దత్. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ సతీమణి ఆమె.

ఇటీవలే నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇక ప్రియాంక దత్ కూడా నిర్మాతగా రాణిస్తుంది. త్రీ ఏంజల్స్ స్టుడియో అనే బ్యానర్ పై ఆమె పలు సినిమాలను నిర్మించింది. బాణమ్, ఓం శాంతి, శక్తి, సారొచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలను నిర్మిచారు. అలాగే బాలు, జై చిరంజీవ అనే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది. బాణం సినిమాకు గాను ప్రియాంక వెండి నంది పురస్కారం అందుకుంది.

ప్రియాంక దత్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments