Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTollywood: విజయ్‌తో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు...

Tollywood: విజయ్‌తో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో కోలీవుడ్ స్టార్ హీరోతో ఉన్న ఛైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గ్లామర్ షోకు, స్కిన్ షోకు ఈ నటి చాలా దూరం. అందుకే ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అయితేనేం.. వచ్చిన సినిమాల్లోనే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. చాలా మంది లాగే ఈ అమ్మడు పెళ్లి వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలా ఈ మధ్యన కూడా ఈ హీరోయిన్ పెళ్లి రూమర్లు బాగా వైరలయ్యాయి. వీటిని చూసి విసుగు చెందిన ఈ ముద్దుగుమ్మ అందరి ముందే ‘అవును నాకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు’ అంటూ తన సినిమాను ప్రమోట్ చేసింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్..ఆ అమ్మాయి మరెవరో కాదు టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్. కాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది నివేదా థామస్.

తమిళ, మలయాళంలోని పలువురి స్టార్ హీరోలతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా థామస్. . విజయ్ దళపతి హీరోగా నటించిన కురువి అనే సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. పై ఫొటో కూడా ఆ సినిమాలోని స్టిల్. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాలో నటిస్తోంది నివేదా థామస్.

ఇవి కూడా చదవండి

ఇందులో ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. . తిరుపతి నేపథ్యంలో దర్శకుడు నందకిశోర్‌ ఇమాని ఈ సినిమా తెరకెక్కించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments