Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTollywood: అయ్యా బాబోయ్.. 27 ఏళ్ల వయసులోనే1000 కోట్లకు వారసురాలు.. ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే...

Tollywood: అయ్యా బాబోయ్.. 27 ఏళ్ల వయసులోనే1000 కోట్లకు వారసురాలు.. ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆ బ్యూటీ.. వైవిధ్యమైన సినిమాలకు ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యత కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది. సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన ఆ చిన్నారి.. మొదట్లో నెపోటిజం విమర్శలను ఎదుర్కొంది. కానీ రోజు రోజుకీ తన నటన, సినిమాలతో ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 27 ఏళ్లు. కానీ ఇప్పుడే రూ.1000 కోట్లు సంపాదించింది. తల్లిదండ్రుల ఆస్తులు కాకుండా సొంతంగానే ఎన్నో వ్యాపారాలు, బ్రాండ్ యాడ్స్, సినిమాలు చేస్తూ కోట్లకు యజమాని అయ్యింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ జాన్వీ కపూర్.

దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురే జాన్వీ. ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ తొలి చిత్రంతోనే నటిగా మెప్పించింది. ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతోపాటు.. జాన్వీ కపూర్ నటనపై ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్సీ 16 ప్రాజెక్టులోనూ కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇవే కాకుండా త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్. తండ్రి హిందీ సినీ పరిశ్రమలో బడా నిర్మాత. అలాగే జాన్నీ లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జరీగానే ఉంటుంది. ప్రస్తుతం జాన్వీ తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్ తో కలిసి ముంబైలోని బాంద్రాలో నివసిస్తున్నారు. అలాగే కుబెలిస్క్ అనే భవనంలో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసింది. ఆ ఇల్లు ధర రూ.65 కోట్లు. అలాగే చెన్నైలో 1.5 ఎకరాల్లో ఇల్లు ఉంది. అలాగే జాన్వీ వద్ద 5 రకాల పెంపుడు కుక్కలు ఉన్నాయి. రూ.2.5 లక్షల విలువైన అమెరికన్ అకిటా కుక్క కూడా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments