Wednesday, October 16, 2024
Google search engine
HomeUncategorizedతొలిరాత్రి టార్చర్.. స్నేహితులకు భార్యను వేలం వేసిన భర్త.. రాత్రంతా గడపాలంటూ ఆ హీరోయిన్‏కు చిత్రహింసలు..

తొలిరాత్రి టార్చర్.. స్నేహితులకు భార్యను వేలం వేసిన భర్త.. రాత్రంతా గడపాలంటూ ఆ హీరోయిన్‏కు చిత్రహింసలు..

తొలిరాత్రి టార్చర్.. స్నేహితులకు భార్యను వేలం వేసిన భర్త.. రాత్రంతా గడపాలంటూ ఆ హీరోయిన్‏కు చిత్రహింసలు..

సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరపై అందమైన జీవితాలు.. తమ నటనతో ప్రేక్షకులను అలరించిన ఎంతో మంది నటీనటులు. కానీ నిజజీవితం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జీవితం పెళ్లి తర్వాత నరకంగా మారింది. వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆ స్టార్ హీరోయిన్‍కు నరకం చూపించాడు ఆమె భర్త. దశాబ్దాలపాటు ఇండస్ట్రీని శాసించిన ఆ తార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరకు తన భర్త నుంచి దూరమై ఇప్పుడు ఒంటరిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్. ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అదే ఫ్యామిలీ నుంచి 1991లో నటిగా ఎంటరై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న కరీష్మా ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా పెళ్లి తర్వాత తన జీవితం ఎంత నరకంగా మారిందో చెప్పుకొచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే దేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ 2016లోనే భర్తతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయిన తర్వాత కరిష్మా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. పెళ్లైన తొలిరాత్రే తన భర్త సంజయ్ తనను చిత్రహింసలకు గురిచేశాడని తెలిపింది. పెళ్లి తర్వాత హనీమూన్‏కు వెళ్లిన సమయంలో అతడి స్నేహితులతో రాత్రి గడపాలని ఒత్తిడి చేశాడని.. డబ్బు కోసం తనను వేలం వేయడానికి కూడా సిద్ధమయ్యాడని తెలిపింది.

అలాగే తన తల్లితో కూడా కొట్టించాలని చూశాడని తెలిపింది. సంజయ్ కపూర్ విడాకుల సమయంలో కరిష్మాకు విలాసవంతమైన ఇంటితోపాటు రూ.14 కోట్లు భరణంగా ఇచ్చాడని అప్పట్లో టాక్ నడిచింది. కరిష్మా కపూర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు పెళ్లి చేసుకుని నిర్ణయించుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే మనస్పర్థలతో విడిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments